26/11 ముంబై ఉగ్రదాడుల ప్రధాన నిర్వాహకుడు సాజిద్ మజీద్ మీర్కు పాకిస్థాన్ కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.2008 ముంబై దాడుల ప్రధాన హ్యాండ్లర్ అయిన నిషేధిత లష్కరే తోయిబా (ఎల్ఇటి) కార్యకర్త సాజిద్ మజీద్ మీర్కు టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో పాకిస్థాన్లోని యాంటీ టెర్రరిజం కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
పంజాబ్ పోలీస్కి చెందిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ దర్యాప్తు చేసిన ఈ కేసులో జైలులో జరుగుతున్న ఇన్-కెమెరా ప్రొసీడింగ్ కావడంతో మీడియాను అనుమతించలేదు.40 ఏళ్ల మధ్యలో ఉన్న దోషి మీర్ ఈ ఏప్రిల్లో అరెస్ట్ అయినప్పటి నుంచి కోట్ లఖ్పత్ జైలులో ఉన్నారని న్యాయవాది తెలిపారు.
కోర్టు దోషికి రూ.4,00,000 జరిమానా కూడా విధించిందని న్యాయవాది చెప్పారు.166 మందిని పొట్టనబెట్టుకున్న 26/11 ముంబై దాడుల్లో సాజిద్ మీర్ భారతదేశం యొక్క మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు.మీర్ను ముంబై దాడులకు ప్రాజెక్ట్ మేనేజర్ అని పిలిచేవారు.
మీర్ 2005వ సంవత్సరంలో మారు పేరుతో నకిలీ పాస్పోర్ట్ను ఉపయోగించి భారతదేశాన్ని సందర్శించినట్లు సమాచారం. సాజిద్ మజీద్ మీర్ తలపై అమెరికాలో 50 లక్షల డాలర్ల నజరానా ఉంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) అధికారులు పాకిస్థాన్లో పర్యటింపనున్న నేపథ్యంలో ఆ దేశం సాజిద్ మీర్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
అయితే గడిచిన ఏప్రిల్ నుంచి లాహోర్లోని కోట్ లక్పతి జైలులోనే మీర్ ఉంటున్నాడని ఆయన తరపు లాయర్ తెలిపారు. సాజిద్ మీర్ నిషేధిత లష్కరే తోయిబా సంస్థలో పనిచేశారు. సాజిద్ మీర్ చనిపోయినట్లు గతంలో పాకిస్థాన్ చెప్పినా.. ఆ విషయాన్ని పశ్చిమ దేశాలు నమ్మలేదు. దీంతో టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో ఈ అంశం కీలకంగా మారింది. పాకిస్థాన్పై వత్తిళ్లు పెరిగాయి. ఆ తర్వాత సాజిద్ మీర్ను పాకిస్థాన్ అరెస్టు చేయాల్సి వచ్చింది.
మరోవైపు ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్కు లాహోర్ ఏటీసీ ఇప్పటికే ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసుల్లో 68 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ముంబయి దాడి ఆపరేషన్ కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ కూడా కొన్నేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. సయీద్, మాకీ ఇద్దరూ లాహోర్లోని కోట్ లప్ఖాప్ట్ జైలులో ఉన్నారు.
More Stories
భారత్ తో వాణిజ్య సంబంధాలకై పాక్ ప్రధానిపై వత్తిడి
అమెరికా లేకపోతే ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?
ఐరోపా వెళ్లే భారతీయులకు వీసా సులభం