ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ శనివారం తన 100వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా గాంధీనగర్లోని ఆమె నివాసంలో తన తల్లి హీరాబెన్ మోదీని ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. తన తల్లి కాళ్లను కడిగిన మోదీ ఆ నీళ్లను కళ్లకు అద్దుకున్నారు.
అనంతరం తల్లికి మిఠాయిలు తినిపించిన ప్రధాని మోదీ ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. హీరాబెన్ మోదీ 100 ఏళ్ల వయసులో కూడా ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్నారు. ఆమె తన చిన్న కొడుకు పంకజ్ (ప్రధాని మోదీ సోదరుడు)తో కలిసి గాంధీనగర్లో నివసిస్తోంది. 100 ఏళ్ల వయస్సులో కూడా హీరాబెన్కు ఎలాంటి వ్యాధి లేదు. ఆమె సాధారణ ఆహారాన్ని ఇష్టపడుతుంటారు. అదే ఆమె ఆరోగ్య రహస్యం కావచ్చు.
తన తల్లి హీరాబెన్కు 100 ఏళ్లు నిండిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం భావోద్వేగ ట్వీట్ చేశారు. తన తల్లితో గడిపిన జీవితాన్ని స్మరించుకుంటూ మోదీ బ్లాగ్ను రాశారు.
‘‘మా బంధం అనేది కేవలం పదం కాదు, అది అనేక రకాల భావోద్వేగాలను అందిస్తోంది. ఈ రోజు జూన్ 18 నా తల్లి హీరాబా 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన రోజు. ఈ జన్మ దినోత్సవం రోజున నేను సంతోషంతో తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ కొన్ని ఆలోచనలు రాశాను’’ అని ప్రధాని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.
తన తల్లి హీరాబెన్ను అసాధారణమైన మహిళగా మోదీ అభివర్ణించారు. ‘‘నా తల్లి చిన్నతనంలోనే ఆమె తల్లిని కోల్పోయిందని, జీవితంలో ఎన్నో కష్టాలను భరించిందని, అయితే దాని కోసం మరింత దృఢంగా ఎదిగింది’’అని మోదీ తన బ్లాగ్లో రాశారు. ప్రధాని మోదీ తన చిన్ననాటి నుంచి తన తల్లితో గడిపిన కొన్ని ప్రత్యేక క్షణాలను గుర్తు చేసుకున్నారు.
తాను పెరిగే కొద్దీ తన తల్లి చేసిన అనేక త్యాగాలను గుర్తు చేసుకున్నారు. తల్లి మనస్సు, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాస లక్షణాలను గురించి ప్రధాని ప్రస్తావించారు. తన తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి నివాసం ఉన్న వాద్నగర్లోని మట్టి గోడలు,మట్టి పలకలతో కూడిన పైకప్పుతో ఉన్న చిన్న ఇంటిని మోదీ గుర్తు చేసుకున్నారు.
‘‘నా తల్లి ఇంటి పనులన్నీ స్వయంగా చేయడమే కాకుండా, ఇంట్లో వచ్చే కొద్దిపాటి ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి కూడా ఆమె పనిచేసింది. ఆమె కొన్ని ఇళ్లలో పాత్రలు కడగడమే కాకుండా ఇంటి ఖర్చుల కోసం చరఖాను తిప్పడానికి సమయాన్ని వెచ్చించేది’’అని మోదీ వివరించారు.
‘‘వర్షాల సమయంలో మా ఇంటి పైకప్పు లీక్ అవుతుండేది, ఇంట్లో వర్షపు నీటిని సేకరించేందుకు తల్లి లీకేజీల కింద బకెట్లు, పాత్రలను ఉంచేది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా తల్లి దృఢత్వానికి ప్రతీకగా నిలుస్తుంది’’ అని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. అధికారికంగా చదువుకోకుండానే నేర్చుకోవడం సాధ్యమవుతుందని తన తల్లి తనకు అర్థమయ్యేలా చేసిందని కూడా రాశారు.
తన తల్లి అత్యంత సాధారణ జీవనశైలిని ప్రతిబింబిస్తుందని, నేటికీ తన తల్లి పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవని పీఎం మోదీ రాశారు. ‘‘ఆమె బంగారు ఆభరణాలు ధరించడం నేను ఎప్పుడూ చూడలేదు, ఆమెకు ఆభరణాల పట్ల ఆసక్తి కూడా లేదు. మునుపటిలాగే, ఆమె తన చిన్న గదిలో చాలా సాధారణ జీవనశైలిని కొనసాగిస్తుంది’’అని మోదీ వివరించారు.
తన బ్లాగ్ పోస్ట్లో పీఎం మోదీ తన తల్లి బహిరంగంగా తనతో కలిసి వచ్చిన రెండు సందర్భాలను మాత్రమే హైలైట్ చేశారు. ఒకసారి అహ్మదాబాద్లోని ఒక పబ్లిక్ ఫంక్షన్లో ఏక్తా యాత్రను ముగించి లాల్ చౌక్లో జాతీయ జెండాను ఎగురవేసి శ్రీనగర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆమె తన నుదిటిపై తిలకం దిద్దింది. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రధాని మోదీ తొలిసారి ప్రమాణం చేయడం రెండవ ఉదాహరణ అని మోదీ వివరించారు.
More Stories
ఏపీలో పోలింగ్ ముగిసినా పలుచోట్ల హింసాత్మక ఘటనలు
సొంత ఇల్లు, కారు, భూమి, షేర్లు లేని ప్రధాని మోదీ
తిహార్ జైలును పేల్చేస్తామని బెదిరింపు