
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీ రేట్ల విషయంలో బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకువచ్చేందుకు రెపోరేటును పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.
తాజాగా మరో 50 బేసిన్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 4.9 శాతానికి పెరిగింది. కాగా మేలో 40 బేసిన్ పాయింట్లు పెంచిన సంగతి విదితమే. మూడు రోజుల చర్చల అనంతరం ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) కీలక నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం రెపో రేటును పెంచి 4.90 శాతంగా ప్రకటించింది.రెపో రేటు లేదా తిరిగి కొనుగోలు చేసే ఎంపిక రేటు అనేది ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రెపో రేటు ముఖ్యమైన సాధనంగా పరిగణిస్తున్నారు.
ద్రవ్యోల్బణం వల్ల ఇంధనంతో సహా పలు వస్తువుల ధరలు పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలను మరింతగా పెంచింది.
అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు రెపోరేటు పెంచుతున్నట్లు ప్రకటించారు. కాగా, ఆగస్టులో సమావేశంలో కూడా వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఏప్రిల్లో8 సంవత్సరాల గరిష్ట స్థాయి 7.79 శాతానికి చేరుకుంది.
ఏప్రిల్లో ఆర్బిఐ అంచనా వేసిన ద్రవ్యోల్బణం 5.7 శాతం కన్నా అధికంగా 6.7 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లు పెంచినట్లు ఆర్బిఐ గవర్నర్ పేర్కొన్నారు. ఈ కీలక వడ్డీ రేట్ల పెరుగుదలతో వ్యక్తిగత రుణాలు, గృహ వినియోగదారులపై ఇఎంఐ భారం పడనుంది.
More Stories
కార్మిక చట్టాల అమలుకై ఐటి ఉద్యోగుల ఆందోళన
357 ఆన్లైన్ మనీ గేమింగ్ సైట్స్పై కేంద్రం కొరడా
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు