బాలీవుడ్ లో అగ్ర నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు సంబంధించిన డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసు దర్యాప్తు అధికారి సమీర్ వాంఖడేపై కేంద్రం బదిలీవేటు వేసింది. సమీర్ వాంఖేడ్ను చెన్నైలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్లో టాక్స్పేయర్ సర్వీస్ డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్గా బదిలీ చేశారు.
ఇది నాన్-సెన్సిటివ్ పోస్టింగ్.నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కి ముంబై కార్యాలయానికి జోనల్ డైరెక్టర్గా డిప్యుటేషన్పై పనిచేసిన వాంఖడే ముంబై తీరంలో కార్డెలియా క్రూయిజ్ షిప్పై దాడి చేసి గత అక్టోబర్లో మాదక ద్రవ్యాల కేసులో ఆర్యన్ ఖాన్,మరో 22 మందిని అరెస్టు చేశారు.
వాంఖడేపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో డ్రగ్స్ కేసు ముంబై జోన్ నుంచి ఎన్సీబీ కేంద్ర బృందానికి బదిలీ చేశారు. వాంఖడేను ఆర్యన్ ఖాన్ కేసు నుంచి తొలగించారు. వాంఖడేపై విజిలెన్స్ విచారణ జరిపారు. ఎన్సీబీ ఆర్యన్ ఖాన్పై అన్ని మాదకద్రవ్యాల ఆరోపణలను క్లియర్ చేస్తూ క్లీన్ చిట్ ఇచ్చింది.
స్టార్ కిడ్ను ప్రాసిక్యూట్ చేయడానికి తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని ఎన్సీబీ పేర్కొంది. విచారణలో లోపభూయిష్టంగా వ్యవహరించినందుకు, విధివిధానాలు పాటించని అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ తెలిపారు.
ఆర్యన్ ఖాన్ కేసులో సజావుగా దర్యాప్తు చేయని సమీర్ వాంఖడేపై చర్య తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.సమీర్ వాంఖడే నేతృత్వంలోని మొదటి దర్యాప్తు బృందంలో పొరపాటు జరిగిందని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ సింగ్ చెప్పారు.
More Stories
అమిత్ షాకు తప్పిన హెలికాప్టర్ ప్రమాదం
నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి
రేజర్వేషన్లపై అమిత్ షా `నకిలీ వీడియో’పై ఎఫ్ఐఆర్