
రాష్ట్రీయ జనతాదళ్ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమార్తె ఇళ్లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం దాడులు చేసింది. అవినీతి, అక్రమాలపై లాలూప్రసాద్ యాదవ్ తో పాటు ఆయన కుమార్తెలపై సీబీఐ కొత్త కేసు నమోదు చేసింది.
ఢిల్లీ, బీహార్ లోని దాదాపు 17 ప్రాంతాల్లో తనిఖీలు సిబిఐ అధికారులు నిర్వహిస్తున్నారు. లాలూ ప్రసాద్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నసమయంలో(2004-2009) మధ్య జరిగిన రైల్వే శాఖకు చెందిన పోస్టుల నియామకాల్లో ఆయన అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సీబీఐ తాజాగా అభియోగాలు మోపింది.
ఈ కేసులో లాలూ కుటుంబ సభ్యులకు కూడా పాత్ర ఉందని సీబీఐ ఆరోపిస్తూ.. వారిని నిందితులుగా పేర్కొంది. ఇక, ఈ పోస్టులకు సంబంధించిన కేసులో రైల్వే ఉద్యోగాలు ఇప్పించేందుకు లాలూ, అతని కుటుంబ సభ్యులు డబ్బుకు బదులుగా భూమి, ఆస్తులను లంచంగా అందుకున్నారని సీబీఐ ఆరోపించింది.
రూ 139 కోట్ల దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో 73 ఏళ్ల లాలూ గత నెలలో జైలు నుంచి బయటకు వచ్చారు. దాణా కుంభకోణం కేసులో బెయిల్ పొందిన కొన్ని వారాల వ్యవధిలోనే లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటిపై సిబిఐ దాడులు చేపట్టింది. దాణా కుంభకోణం కేసులో లాలూకు ఐదేళ్ల జైలుతో పాటు రూ. 60 లక్షల జరిమానా విధించింది.
More Stories
మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
జాన్సన్ & జాన్సన్ కు రూ.8 వేల కోట్ల జరిమానా!
దగ్గు మందు ‘కోల్డ్రిఫ్’ సిరప్ కంపెనీ యజమాని అరెస్ట్