కొన్ని రాష్ట్రాలలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంతోపాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితిని చర్చించేందుకు ఈనెల 20, 21 తేదీలలో రాజస్థాన్లోని జైపూర్లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం కానున్నది. ఈ సంవత్సరం చివరకు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి
ఈ సమావేశంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన బిజెపి సంస్థాగత ముఖ్య నాయకులు కూడా పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలలో ఒక సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రసంగిస్తారని వారు చెప్పారు.
బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులతోపాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఇన్చార్జులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొంటారు. 2020 ప్రారంభంలో కరోనా రాక తర్వాత పార్టీ నాయకులందరూ వర్చువల్గా అప్పుడప్పుడు సమావేశం అవుతున్నప్పటికీ ప్రత్యక్షంగా జాతీయ స్థాయిలో సమావేశం కావడం మాత్రం ఇదే
మొదటిసారి. మే 20న జాతీయ కార్యవర్గం, రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు సమావేశం అవుతారని, మరుసటి రోజున పార్టీ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు విడిగి సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయా రాష్ట్రాలలో పార్టీ చేపట్టిన కారకలాపాలపై ఒక నివేదిక తీసుకురావాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కోరారు.
More Stories
రెజ్లర్ బజరంగ్ పూనియాపై సస్పెన్షన్ వేటు
ఓట్ల కోసం నిప్పుతో కాంగ్రెస్ చెలగాటం
పోలింగ్కు ముందే జారిపోతున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు