
హైదరాబాద్ ఎంఎంటీఎస్ ఛార్జీలను తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఫస్ట్ క్లాస్ ఛార్జీలను 50 శాతం మేర తగ్గించారు. ఎంఎంటీఎస్ S ఛార్జీలను మే 5 నుండి ఫస్ట్ క్లాస్ సింగిల్ జర్నీ ప్రయాణికులకు 50 శాతం వరకు తగ్గించనున్నారు.
మే 5 నుంచి సబర్బన్ రైలు సర్వీసుల్లో ఫస్ట్ క్లాస్ బేసిక్ ఛార్జీలను తగ్గిస్తూ.. రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. సబ్-అర్బన్ సెక్షన్ల మీదుగా ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు సింగిల్ జర్నీకి ఫస్ట్ క్లాస్ బేస్ ఛార్జీలు తగ్గించనున్నారు.
కరోనా విధించిన లాక్డౌన్ తర్వాత సేవలను తిరిగి ప్రారంభించినప్పటి నుండి దక్షిణ మధ్య రైల్వే సబ్-అర్బన్ ప్రయాణీకుల ప్రయోజనం కోసం ఎంఎంటీఎస్ సేవల సంఖ్యను క్రమంగా పెంచుతోందని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో గుర్తు చేసింది.
ప్రస్తుతం, ఫలక్నుమా-సికింద్రాబాద్-హైదరా బాద్-బేగంపేట్-లింగంపల్లి-తేలా పూర్-రామచంద్రపురం విభాగాల్లో 29 రైల్వే స్టేషన్లను కవర్ చేస్తూ 50 కిలోమీటర్ల మేర 86 సర్వీసులు నడుపుతున్నారు. ఎంఎంటీఎస్ సెక్షన్లోని వివిధ స్టేషన్లలో పీక్ అవర్ ట్రాఫిక్ను పరిగణనలోకి తీసుకొని ప్రయాణీకుల ప్రయాణ అవసరాలను తీర్చడానికి ఈ సేవలు ప్రణాళిక చేశారు.
సబ్-అర్బన్ ప్రయాణీకులకు వేగవంతమైన . చౌకైన రవాణా మార్గాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రయాణీకులకు మరింత ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ప్రయోజనాన్ని పొందాలని ప్రయాణీకులకు విజ్ఞప్తి చేస్తూ, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్-ఛార్జ్) అరుణ్ కుమార్ జైన్ వివరాలు వెల్లడించారు. ఎమ్ ఎమ్ టీఎస్ ఫస్ట్ క్లాస్లో తగ్గిన ఛార్జీలు మే 5 నుండి అమలులోకి వస్తాయని ట్వీట్ చేశారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి