
లక్షలాది పేద,దిగువ మధ్యతరగతి కుటుంబాలు అందులో ఉండే ఆడ, మగ కూడా మద్యానికి బానిసలై పోతున్నారని కృష్ణసాగర్ రావు విచారం వ్యక్తం చేశారు. చాలా కుటుంబాలు నాశనం అవుతున్నాయని, సామాజికంగానూ ,ఆరోగ్యపరంగానూ,ఆర్థికంగానూ అటు భార్యాభర్తల వివాహ సంబంధాల పరంగానూ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆయన వివరించారు.
లక్షలాదిమంది యువత ముఖ్యంగా హై స్కూల్ వయస్సు నుండే మద్యానికి, గంజాయికి బానిసలవుతున్నారని రావు తెలిపారు. కొకైన్ లాంటి హై గ్రేడ్ సింథటిక్ డ్రగ్స్ కూడా చాలా పెద్ద యెత్తున హైదరాబాద్ నైట్ లైఫ్ లో అందుబాటులో కి వచ్చేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ సంస్థలైనటువంటి డిఆర్ఐ కానీ, ఎన్ సి బి కానీ, కస్టమ్స్ లాంటి వాళ్ళు హైదరాబాద్ డ్రగ్స్ మార్కెట్ బాగా పెరుగుతుందని దేశంలోనే నంబర్ వన్ అవుతుందని చెప్తూనే వస్తున్నారని ఆయన హెచ్చరించారు.
ఏళ్ల తరబడి మహమ్మరిలా పెరిగిపోతున్న ఈ డ్రగ్స్ కల్చర్ ని కేసీఆర్, కేటీఆర్ లు ఎందుకు అదుపు చేయలేకపోతున్నారో చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందని బిజెపి నేత స్పష్టం చేశారు. అసలు గతంలో ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖలు కేసులు పెట్టడం విచారణ చేస్తున్నట్లు మీడియా ముందు హడావుడి చేయడం తరువాత ఎలాంటి చర్యలు లేకుండా సైలెంట్ అయిపోవడం జరుగుతున్నదని ఆయన గుర్తు చేశారు.
అసలు సమాజాన్ని చిన్నాభిన్నం చేసే ఇంత దారుణమైన డ్రగ్స్ అనే సమస్య మీద టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తుందో కేసీఆర్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కృష్ణసాగరరావు స్పష్టం చేశారు. అసలు ఈ విషయంలో ప్రభుత్వానికి చిత్త శుద్ధి కానీ విశ్వసనీయత కానీ ఉన్నాయా..? అని ఆయన ప్రశ్నించారు.
అసలు మొత్తం ఈ ప్రభుత్వ వైఖరి,వ్యవహారం చూస్తుంటే, తెలంగాణ లో ఇంత భారీగా డ్రగ్స్ పెరిగిపోవడం చూస్తుంటే ప్రభుత్వానికి సంబంధం ఉన్న ప్రభుత్వంలో భాగస్వాములైన టువంటి శక్తివంతమైన వ్యక్తులకు ఎవరికైనా ఈ వేల కోట్ల రూపాయల అక్రమ డ్రగ్స్ వ్యాపారం లో సంబంధం ఉందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. అందుకే పోలీసులు అంత పెద్దగా పట్టించుకోకుండా తూ తూ మంత్రంగా పని చేస్తున్నట్లు అనిపించక మానదని తేల్చి చెప్పారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు