ఉగ్రవాదమే అతిపెద్ద మానవహక్కుల ఉల్లంఘన అని స్పష్టం చేస్తూ ఉగ్రవాదంపై పోరు మానవ హక్కుల పరిరక్షణకు విరుద్ధం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ స్పష్టం చేశారు.
”ఏ నాగరిక సమాజానికైనా ఉగ్రవాదం శాపం. దీని వల్ల మన దేశం లాగా ఎవరూ బాధపడలేదు. ఈ సమస్యపై వారు తీసుకునే కోణం గురించి మానవ హక్కుల సంస్థలతో నాకు విభేదాలు ఉన్నాయి. కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ జరిగినప్పుడల్లా, ఈ సంస్థలు మానవ హక్కుల సమస్యతో వస్తాయి. కానీ ఉగ్రవాదంలా మానవ హక్కులను ఉల్లంఘించేది మరొకటి లేదని నేను నమ్ముతున్నాను” అని తేల్చి చెప్పారు.
ఉగ్రవాదాన్ని దాని మూలాల నుండి అంతం చేయడం మానవ హక్కుల పరిరక్షణకు ఆవశ్యకం అని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) 13వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో పాల్గొంటూ చెప్పారు. ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబించిందని ఆయన తెలిపారు.
జమ్మూకశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు చేస్తున్న కృషిని కొనియాడుతూ ఉగ్రవాదం, ఉగ్రవాదులతో పోరాడడం ఒక విషయం కాగా ఉగ్రవాదాన్ని నిర్మూలించడం మరొకటి అని పేర్కొన్నారు. మనం అలా చేయాలనుకుంటే ఉగ్రవాదులకు నిధులు సమకూరుతున్న మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయవలసిందే అని స్పష్టం చేశారు.
2018-19లో, జమ్మూ కాశ్మీర్లో ఎన్ఐఎ నమోదు చేసిన ఉగ్రవాద నిధుల కేసులు ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో సహాయపడ్డాయిని కొనియాడుతూ అప్పటి వరకు, ఈ ఏజెన్సీలు ఈ టెర్రర్-ఫండింగ్ సాధనాలపై దాడి చేయలేదని గుర్తు చేశారు. ఎన్ఐఎ కేసులు నమోదు చేసిన తర్వాత, ఉగ్రవాద గ్రూపులకు టెర్రర్ ఫండింగ్ సులభమైన మార్గాలు అందుబాటులో లేవని చెప్పారు.
మనం దీన్ని పూర్తిగా ముగించలేకపోవచ్చు, కానీ మనం ఆ విధంగా నిధులు పొందటం ఉగ్రవాదులకు కష్టతరం చేయవచ్చని అమిత్ షా తెలిపారు. 2020-21లో, ఎన్ఐఎ తీవ్రవాద గ్రూపులకు చెందిన ఓవర్-గ్రౌండ్ వర్కర్లపై అనేక కేసులు నమోదు చేశాయని, అనేక స్లీపర్ సెల్లను నాశనం చేయడంలో విజయం సాధించిందని ఆయన అభినందించారు.
“ఇది తీవ్రవాద గ్రూపుల లాజిస్టిక్స్, ఆయుధాల సరఫరాకు తీవ్ర దెబ్బ కలిగించింది. ఉగ్రవాదానికి మద్దతిస్తున్నప్పటికీ సమాజంలో గౌరవప్రదంగా జీవిస్తున్న వారిని ఎన్ఐఏ బహిర్గతం చేసి చట్టం ముందు ప్రవేశపెట్టింది’ అని షా వివరించారు.
మావోయిస్టు ఉద్యమానికి నిధులు సమకూర్చిన కొన్ని కేసులను ఇప్పుడు ఎన్ఐఏ చేపట్టినదని చెబుతూ కశ్మీర్లో సాధించగలిగిన విజయాన్ని ఆ ఏజెన్సీ ఇక్కడ కూడా సాధిస్తుందని ఆశిస్తున్నట్లు షా చెప్పారు. హోమ్ మంత్రిత్వ శాఖ ప్రకారం, టెర్రర్ ఫండింగ్ విషయాలలో,
ఎన్ఐఎ మొత్తం 105 కేసులు నమోదు చేసింది. 876 మంది నిందితులతో కూడిన 94 కేసులు చార్జిషీట్ దాఖలు చేసింది. 100 మంది నిందితులకు శిక్ష పడింది.
దేశంలోని దర్యాప్తు సంప్రదాయాల్లో సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా చెప్పారు. దర్యాప్తులు ఇకపై థర్డ్ డిగ్రీ (అనుమానితులను హింసించడం)పై ఆధారపడి ఉండవని స్పష్టం చేశారు. పరిశోధన సాంకేతికత, డేటా, సమాచారంపై ఆధారపడి ఉండాలని చెప్పారు. మనం ఈ సంస్కరణను తీసుకురావాలనుకుంటే డేటాబేస్లను రూపొందించాలని, డిజిటల్ ఫోరెన్సిక్స్లో నైపుణ్యం కలిగి ఉండాలని వివరించారు.
ఇటీవల జరిగిన ఒక సమావేశంలో, సైకోట్రోపిక్ పదార్థాలు, హవాలా లావాదేవీలు, ఆయుధాల స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ, బాంబు పేలుళ్లు, టెర్రర్ ఫండింగ్, ఉగ్రవాదంపై డేటాబేస్ రూపొందించే పనిని ఎన్ఐఎ కు అప్పగించినట్లు ఆయన చెప్పారు. “ఇది బాగా ప్రారంభమైంది. మనం ఈ డేటాబేస్ను అన్ని రాష్ట్రాల ఏజెన్సీలతో షేర్ చేసి, వారి వద్ద ఉన్న సమాచారాన్ని డేటాబేస్లో జోడిస్తే, అది కేంద్ర ఏజెన్సీలకు మాత్రమే కాకుండా అన్ని రాష్ట్రాలకు కూడా సహాయపడుతుంది” అని తెలిపారు.
అయితే డేటా లోపభూయిష్టంగా ఉంటే, అది చెత్తతో సమానం అని స్పష్టం చేశారు. దేశంలోని డేటాబేస్లపై ప్రస్తుత పరిస్థితి సంతృప్తికరంగా లేదని చెప్పారు. రాష్ట్రాలలోని అన్ని ప్రత్యేక ఉగ్రవాద నిరోధక ఏజెన్సీలతో ఎన్ఐఎ ప్రత్యక్ష కమ్యూనికేషన్ కలిగి ఉండాలని సూచించారు.
ప్రభుత్వం ఒక మోడస్ ఆపరేండి బ్యూరోను రూపొందించిందని, ఇందులో యువతను రిక్రూట్ చేసుకునే ఉగ్రవాద గ్రూపుల వెనుక ఉన్న కార్యాచరణను అధ్యయనం చేయడంలో ఇతర సంస్థలకు సహాయం చేయాలని ఎన్ఐఎ ను ఆదేశించిందని ఆయన చెప్పారు.
2014 నుండి,
ఎన్ఐఎ చట్టం, ఉపా చట్టాన్ని బలోపేతం చేయడంతో సహా ఎన్ఐఎ ను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని అమిత్ షా తెలిపారు. అంతర్జాతీయ ఏజెన్సీగా గుర్తింపు పొందేందుకు ఎన్ఐఏ తప్పనిసరిగా కృషి చేయాలని సూచించారు. “ప్రపంచంలోని ఇతర బలమైన ఉగ్రవాద వ్యతిరేక ఏజెన్సీల తరహాలో ఎన్ఐఎను అభివృద్ధి చేసేందుకు, ఇద్దరు నిపుణులతో కూడిన సెల్ను ఏర్పాటు చేశాం” అని షా వెల్లడించారు.
ఉగ్రవాదానికి సంబంధించిన సమాచారంపై ఏజెన్సీలు, రాష్ట్ర పోలీసుల మధ్య సమన్వయం, ఉగ్రవాద నిరోధక చట్టాలను పటిష్టం చేయడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అమిత్ షా భరోసా ఇచ్చారు. ఉగ్రవాద నిరోధక ఏజన్సీలను పటిష్టం చేయాలని, ఉగ్రవాద కేసుల్లో 100 శాతం నేరారోపణ సాధించాలనే లక్ష్యం ఉండాలని స్పష్టం చేశారు.
“మన విజయాన్ని కేసుల పరంగా కొలవకూడదు. ఇది సంప్రదాయంగా ఏకీకృతం కావాలి. మన విజయం వ్యక్తిగతంగా కాకుండా సంస్థాగతంగా ఉండాలి. సంప్రదాయాన్ని సంస్థాగతీకరించడానికి ఒక యంత్రాంగాన్ని రూపొందించాలి, ”అని ఆయన సూచించారు.
ఉగ్రవాదం పట్ల మోదీ ప్రభుత్వానికి ఏమాత్రం సహనం లేదని పునరుద్ఘాటించిన షా, “నేడు భారతదేశం పురోగమిస్తోంది. భారతదేశం లేకుండా ప్రపంచ లక్ష్యాలను సాధించలేని స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి భారతదేశ అంతర్గత భద్రత పటిష్టంగా ఉండటం ముఖ్యం. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని మనం సాధించాలంటే, భారతదేశం అంతర్గతంగా సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం” అని అమిత్ షా స్పష్టం చేశారు.
తొలుత ఎన్ఐఎ డిజి కుల్దీప్ సింగ్ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రారంభించినప్పటి నుండి దాదాపు 400 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 349 కేసుల్లో చార్జిషీట్లు దాఖలయ్యాయి. 2,494 మందిని అరెస్టు చేశారు. వీరిలో 391 మంది దోషులుగా నిర్ధారించబడ్డారు. ఈ సంస్థ 93.25 శాతం నేరారోపణ చేయగలిగింది అని వివరించారు.
More Stories
రాజ్యాంగం మారుస్తామని కాంగ్రెస్ అసత్య ప్రచారం
రాయ్బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ
బీజేపీ గెలుపు మన దేశానికి అవసరం