కాగా, తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి భరతమాతకు పూల దండ వేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ హిందుత్వం అంటే మతం, కులం కాదని అదొక జీవన విధానమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. హిందుత్వంతోనే శాంతి, సోదరభావం, సహజీవనం సాధ్యమని భారత్ ప్రపంచానికి చాటి చెప్పిందని పేర్కొన్నారు.
ప్రపంచంలోనే హిందుత్వకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. ఇటీవల కాలంలో హిందుత్వంపై అనేక చర్చలు జరుగుతున్నాయని చెబుతూ హిందుత్వలో భాగమైన యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుందని తెలిపారు.
యోగాతో క్రమశిక్షణ అలవడుతుందని, సమస్యలను, సవాళ్లను ఎదుర్కొనే శక్తి వస్తుందని తెలిపారు. ఐక్యరాజ్య సమితి ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ను ప్రకటించడం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కృషి ఫలితమే అని కొనియాడారు. టీఆర్ఎస్ పాలనలో హిందువులపై దాడులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందుత్వను విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
హిందూ ధర్మాన్ని రక్షించే పాలకులు రావాలని కృష్ణమఠం ఆధ్యాత్మిక గురువు యోగానంద సరస్వతీ గోపాల అభిలాష వ్యక్తం చేశారు. హిందూ ధర్మాన్ని, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ బాధ్యత యువత చేతిలోనే ఉందని ఆయన చెప్పారు.
More Stories
విద్యా భారతి విజ్ఞాన కేంద్రంకు డా. భగవత్ తో ప్రారంభోత్సవం
కొండా సురేఖకు ఎన్నికల కమిషన్ హెచ్చరిక
తెలంగాణాలో రాగల ఐదు రోజులు వడగాలులు