ఈ కాలపు యువత అసలైన చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్రం(కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) అధ్యక్షులు, రిటైర్డ్ ఐ ఎ ఎస్ అధికారి డాక్టర్ చామర్తి ఉమా మహేశ్వరరావు చెప్పారు. అప్పుడే సమాజంలో చోటు చేసుకొంటున్న అంశాలపై స్పష్టమైన అభిప్రాయం ఏర్పడుతుందని తెలిపారు.
చరిత్ర పుస్తకాల్లోని వక్ర రీతులను సరిచేస్తూ విద్యాభారతి, చిన్మయ మిషన్ సంయుక్తంగా ఉన్నత పాఠశాల విద్యార్థులకోసం 6,7,8 తరగతుల చరిత్ర పుస్తకాలను రూపొందించాయి. చిన్మయ యువ కేంద్రం డైరక్టర్ స్వామి మితానంద, విద్యాభారతి తమిళనాడు అధ్యక్షులు క్రిష్ణ చెట్టి తదితరులతో కలిసి డాక్టర్ ఉమామహేశ్వరరావు ఈ పుస్తకాలను విడుదల చేశారు.
ఈ పుస్తకాల రచనలో పాలు పంచుకొన్న అధ్యాపకులను ఆయన అభినందిస్తూ బారత్ కేంద్రిత విద్యా వ్యవస్థ ఏర్పడాలని ఎందరో మేధావులు, విద్యావేత్తలు కలలు కంటూంటారని ఆయన తెలిపారు. ఇటువంటి పుస్తకాల ద్వారా అటువంటి వ్యవస్థ సాకారం అవుతుందని అభిలషించారు.
దేశ వ్యాప్తంగా విద్యాభారతి స్వచ్ఛంద సంస్థ అందిస్తున్న సేవలను డాక్టర్ ఉమా మహేశ్వరరావు వివరించారు. 26 వేలకు పైగా పాఠశాలలు, లక్షన్నర మంది ఆచార్యుల ద్వారా సుమారు 34 లక్షలమందికి విద్యను అందించటం జరుగుతోందని పేర్కొన్నారు. ఇటువంటి విద్యాభారతి లో సేవలు అందిస్తున్న వారికి అభినందనలు తెలిపారు.
.
More Stories
కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
పసుపు బోర్డు ఏర్పాటు ఆరంభం మాత్రమే
తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్