
కేసీఆర్ కుటుంబంలో గత 18 నెలలుగా సీఎం కుర్చీ పంచాయతీ నడుస్తోందని బిజెపి ఎంపీ డి అరవింద్ తెలిపారు. కొడుకును సీఎం చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని స్కెచ్ వేసిన కేసీఆర్కు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పచ్చి పట్టిందని ఆయన చెప్పారు.
దానితో ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించలేదనే కేటీఆర్అలిగి అమెరికా వెళ్లిపోయాడన్న అర్వింద్.. తమ రాజకీయ భవిష్యత్ నాశమవుతుందనే హరీష్ రావు, సంతోష్ రావు, కవితలు ఆయన సీఎం కాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. ఏదేమైనా మంత్రి కేటీఆర్ జన్మలో ముఖ్యమంత్రి కాలేదని అరవింద్ స్పష్టం చేశారు.
కాగా, రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. బోధన్లో శివాజీ విగ్రహ వివాదంలో ఇదే జరిగిందని చెప్పారు. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ను భ్రష్టుపట్టించారని విమర్శించా
గతంలో చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తప్పులు చేసి జైలుకెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సీపీ నాగరాజు టీఆర్ఎస్కు చెంచాగా మారాడన్న ఆయన ఆర్మూర్లో తనపై జరిగిన దాడి వెనుక ఆయనే ఉన్నాడని ఆరోపించారు. అందుకే తన ఫిర్యాదు తీసుకోలేదని చెప్పారు.
పంట కొనే తెలివిలేని కవిత కార్పొరేటర్లను మాత్రం బాగానే కొనుగోలు చేస్తోందని అర్వింద్ ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ అనవసర రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కేంద్రం పూర్తి ధాన్యం కొంటామని చెప్పినా.. కేసీఆర్ మాత్రం ప్రజలను కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
More Stories
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపికలో కీలక నివేదిక
`దున్నపోతు’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రుల కుమ్ములాటలు
అత్యుత్తమ పరిశోధన కేంద్రంగా సమ్మక్క, సారక్క యూనివర్సిటీ