అవిశ్వాస తీర్మానానికి ముందే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ)కి చెందిన 24 మంది ఎంపీలు ప్రతిపక్షంతో కలిసి వెళ్లాలని నిర్ణయించడమే ఇందుకు కారణం. దానితో ఓటింగ్ కు ముందే రాజీనామా చేస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
గత వారం పాకిస్థాన్ పార్లమెంట్లో ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఏ క్షణమైనా ఓటింగ్ జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, గురువారం ఇమ్రాన్కు షాకిస్తూ ఎంపీలు, మంత్రులు మూకుమ్మడి రాజీనామాలు చేశారు.
24 మంది ఎంపీలు, ముగ్గురు మంత్రులు రాజీనామా చేయడంతో పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మాణం నెగ్గాలంటే 172 సీట్ల మెజార్టీ నిరూపించుకోవాలి. కాగా, దిగువ సభలో ప్రభుత్వానికి 155 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు నాలుగు మిత్రపక్షాలతో కలిసి (155+ మిత్రపక్షాలు 20 సీట్లు) 175 సీట్లను ప్రభుత్వం కలిగి ఉంది.
ఇదిలా ఉండగా.. ప్రధాని ఇమ్రాన్ఖాన్ పాలనలో దేశంలో ఆర్థిక వ్యవస్థ బలహీనపడటంతో దిగువ సభలో ప్రభుత్వ మిత్రపక్షాలన్నీ ప్రతిపక్షం వైపు మొగ్గు చూపుతున్నాయని పర్వేజ్ ఎలాహి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఏర్పడింది. ఇక, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి సైన్యం మద్దతు ఉందని.. అందుకే ఆయన అంత ధీమాగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు.. అవిశ్వాసానికి ముందు ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేసే అవకాశం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
వీరిలో చాలా మంది ఎంపీలు తీర్మానంపై ఓటింగ్కు ముందు ఇస్లామాబాద్లోని సింధ్ హౌస్లో ఆశ్రయం పొందారు. ప్రతిపక్షంతో చేతులు కలపడంతో ప్రభుత్వం తమను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని వీరంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. సింధ్ ప్రావిన్స్లోని ఇస్లామాబాద్లో ఉన్న సింధ్ హౌస్ ప్రభుత్వ అధికారిక భవనం. సింధ్ ప్రావిన్స్లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ ముస్లి లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) అధికారంలో ఉంది.
ప్రతిపక్షంతో చేతులు కలపడంతో ప్రభుత్వం తమను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని వీరంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రెబల్ ఎంపీలు తాము తలదాచుకునేందుకు ఇదే సురక్షిత స్థలమని భావించారు.
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే ఎంపీలపై ఎలాంటి చర్యలు తీసుకోబోనని ప్రధాని ఇమ్రాన్ హామీ ఇస్తే తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు రెబల్ ఎంపీ రాజా రియాజ్ తెలిపారు. ప్రస్తుతం 24 మంది ఎంపీలు సింధ్ హౌస్లో ఉన్నట్టు చెప్పారు. అంతేకాదు, మున్ముందు మంత్రులు, మరెంతోమంది ఎంపీలు కూడా సింధు హౌస్కు వస్తారని బాంబు పేల్చారు.
More Stories
గాజాపై ఇజ్రాయెల్ దాడిలో భారతీయుడు మృతి
రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తొలగింపు
సూర్యుడి ఉపరితలంపై విస్పోటనాలు