`ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను అభినందించిన ప్రధాని 

గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంటున్న `ది కశ్మీర్ ఫైల్స్’ చిత్ర యూనిట్ ను ప్రధాన మంత్రి నరేంద్ర   మోదీ ప్రశంసించారు. సినిమాను చూసిన ఆయన   చిత్ర దర్శక, నిర్మాతలైన వివేక్ అగ్నిహోత్రితో పాటు గు నిర్మాత అభిషేక్ అగర్వాల్‌ను అభినందించారు.

 అప్పట్లో కశ్మీర్‌లో జరిగిన సంఘటనలను కళ్లకు కట్టినట్టు చూపించారని ప్రధాని అభినందించినట్టు చిత్ర దర్శక, నిర్మాతలు పేర్కొన్నారు.   ఈ విషయాన్ని చిత్ర నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ తన ట్విటర్‌ హ్యాండిల్‌లో షేర్‌ చేస్తూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాను ఆయ ప్రశంసించడం, దాని గొప్పతనం గురించి చెప్పిన మాటలు మాకు ఎంతో ప్రత్యేకం. మేము ఆ చిత్రాన్ని నిర్మించడంలో ఎప్పుడూ గర్వపడలేదు. ధన్యవాదాలు మోదీజీ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ ప్రేక్షకులతో పంచుకున్నారు డైరెక్టర్‌ వివేక్ అగ్నిహోత్రి.