మొత్తం 403 స్థానాల యుపి అసెంబ్లీలో అఖిలేష్ యాదవ్ పార్టీ సమాజ్వాది పార్టీ (ఎస్పి) 140 స్థానాలకు పైగా సాధించుకుంటుంది. యుపిలో పి మార్క్ ఎగ్జిట్ పోల్ మేరకు బిజెపికి 225 నుంచి 255, ఎస్పికి 130 155, బిఎస్పికి 1222, కాంగ్రెస్కు 2 6 ఇతరులకు 4 వరకూ వస్తాయి. ఇక్కడనే మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్లో బిజెపికి 262 277, ఎస్పికి 119 134, బిఎస్పికి 7 15, కాంగ్రెస్కు 38 వస్తాయని వెల్లడైంది.
ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్లో బిజెపికి 138 140, ఎస్పికి 235 నుంచి 240, బిఎస్పికి 1923, కాంగ్రెస్కు 12 నుంచి 16 ఇతరులకు 1 లేదా 2 స్థానాలు వస్తాయి. సిఎన్ఎన్ న్యూస్ 18 ఎగ్జిట్ పోల్లో బిజెపికి 240, ఎస్పికి 140, బిఎస్పికి 17, కాంగ్రెస్కు సున్నా ఇతరులకు 6 స్థానాలు వస్తాయని తేల్చారు.
పంజాబ్ లో ఆప్!
పంజాబ్లో ఈసారి కేజ్రీవాల్ నాయకత్వపు ఆప్ అధికారంలోకి వస్తుందని వివిధ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో స్పష్టం అయింది. మొత్తం 117 స్థానాల పంజాబ్లో ఆప్ 68 స్థానాలను దక్కించుకుంటుంది. ఇక్కడ అధికార స్థాపనకు అవసరం అయిన సీట్ల సంఖ్య 59.
రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్లో ఇటీవలి అంతర్గత కలహాల పరిణామాలు ఈసారి ఎన్నికల ఫలితాలతో వెలుగులోకి వచ్చాయి. నవ్జ్యోత్ సింగ్ సిద్ధూతో విభేదాలతో పార్టీ వీడి బిజెపితో జట్టు కట్టిన మాజీ సిఎం అమరీందర్ సింగ్ ప్రభావం కాంగ్రెస్పై పడింది. ఇక ఇక్కడ అధికార వ్యతిరేకతను ఆప్ తనకు అనుకూలంగా మల్చుకుంది.
బిజెపి నాలుగో స్థానంలోనే నిలిచిందని వెల్లడైంది. అయితే పంజాబ్లో బిజెపి మాజీ మిత్రపక్షం అకాలీదళ్కు ఈసారి 18 స్థానాలు వస్తాయని ఎగ్జిట్పోల్స్ ఫలితాలలో వెల్లడైంది. ఆత్మసాక్షి సర్వేలో ఆప్ 34 38, కాంగ్రెస్ 58-61, అకాలీదళ్ 18 21, బిజెపి 4 నుంచి 5 స్థానాలు దక్కించుకుంటాయని వెల్లడైంది.
యాక్సిస్ మై ఇండియా సర్వేలో ఆప్ 76 90, కాంగ్రెస్ 19-31, అకాలీదళ్ 7-11, బిజెపి 1 నుంచి 4 ఇతరులకు 2 స్థానాలు వస్తాయని స్పష్టం చేశారు. ఇండియా టుడే అంచనాలలో ఆప్ 76- 90, కాంగ్రెస్ 19-31, అకాలీదళ్ 7-11, బిజెపి 14, ఇతరులకు సున్నా నుంచి రెండు స్థానాలు వస్తాయని వెల్లడించారు.
ఉత్తరాఖండ్ లో నువ్వానేనా!
ఉత్తరాఖండ్లో ఈసారి బిజెపి, కాంగ్రెస్ మధ్య నువ్వానేనా పోటీ తీవ్రంగా ఉంది. అయితే బిజెపి నామమాత్రంగా కాంగ్రెస్ కన్నా ముందంజలో ఉందని ఎగ్జిట్ పోల్స్తో వెల్లడైంది. మొత్తం 70 స్థానాల అసెంబ్లీలో బిజెపికి 37, కాంగ్రెస్కు 31, ఆప్నకు 1, ఇతరులకు 1 వస్తాయని టైమ్స్ నౌ వీటో సర్వేలో వెల్లడైంది.
ఇక ఏబిపిసీ ఓటర్ సర్వేలో బిజెపికి 26-32, కాంగ్రెస్కు 32-38, ఆప్ 2 ఇతరులకు 3 నుంచి 7 సీట్లు వస్తాయని తేల్చారు. టుడేస్ చాణక్య సర్వేలో బిజెపికి 36 నుంచి 50, కాంగ్రెస్కు 17- 31, ఆప్ సున్నా, ఇతరులకు ఆరు వరకూ వస్తాయని వెల్లడించారు.
గోవాలో అనిశ్చితి
తీర రాష్ట్రం గోవాలో పోటీ తీవ్రంగా ఉందని ఎగ్జిట్ పోల్స్తో వెల్లడైంది. అయితే 40 స్థానాల గోవాలో బిజెపికి 18 సీట్లు, కాంగ్రెస్కు 15 వస్తాయని వెల్లడైంది. అయితే ఇక్కడ అధికార స్థాపనకు మెజార్టీ సంఖ్య 21. దీనితో రెండు కీలక పార్టీలూ అధికారాన్ని సొంతంగా అందుకోవడం క్లిష్టం అవుతోంది.
దీనితో ఇంతకు ముందటిలాగానే ఇక్కడ ఎమ్మెల్యేలకు గాలాల వేట ఆరంభం అవుతుందని భావిస్తున్నారు. 2017 ఎన్నికలలో కాంగ్రెస్ అత్యధిక స్థానాల పార్టీగా నిలిచినా బిజెపి దూకుడుతో అధికారానికి రాలేకపోయింది.
మణిపూర్లో బిజెపినే
ఈసారి ఎన్నికలలో మణిపూర్లో బిజెపి అధికారం దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైంది. 60 స్థానాల అసెంబ్లీలో బిజెపికి 30 స్థానాలు వస్తాయని, ఈ విధంగా మెజార్టీ బలానికి ఒక్క స్థానం తక్కువ అవుతుందని విశ్లేషించారు. ఇక్కడ కాంగ్రెస్కు 14 స్థానాలు వస్తాయని తేల్చారు.
More Stories
రాయ్బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ
బీజేపీ గెలుపు మన దేశానికి అవసరం
బ్రిజ్భూషణ్ టికెట్ను కొడుక్కి బిజెపి సీట్