రాజ్యసభ మాజీ సభ్యులు, టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు (104) కన్నుముశారు. గత కొన్ని రోజులుగా అనార్యోగంతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్లోని తన కూతురు నివాసంలో తుదిశ్వాస విడిచారు.
యడ్లపాటి టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. తెలుగు రైతు అధ్యక్షునిగా, గుంటూరు జిల్లా పరిషద్ చైర్మన్ గా కూడా పనిచేశారు. గుంటూరు జిల్లాలో సంగం డైయిరీకి వెంకట్రావు వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఉన్నారు. జంపనిలో సహకార చక్కర ఫ్యాక్టరీ ఏర్పాటులో కూడా కీలక పాత్ర వహించారు.
తెనాలి సమీపంలోని బోడపాడులో 1919లో యడప్లాటి జన్మించారు. ఆచార్య రంగ శిష్యునిగా, కృషికార్ లోక్ పార్టీ నుండి రాజకీయ జీవనం ప్రారంభించారు. 1967,1978లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన.. 1978-80 మధ్య వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. అనంతరం 1983లో టీడీపీలో చేరారు.
రాజకీయ కురువృద్ధులు యడ్లపాటి వెంకట్రావు మృతికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన యడ్లపాటి రాజకీయ జీవితం ఎంతో ఆదర్శప్రాయంగా సాగిందని ఆయన కొనియాడారు.
రాష్ట్ర మంత్రిగా, జడ్పీ చైర్మన్గా, రాజ్యసభ సభ్యునిగా పని చేసిన ఆయన తాను చేపట్టిన పదవులకు వన్నెతెచ్చారని పేర్కొన్నారు. యడ్లపాటి జీవితం ప్రతీతరానికి స్ఫూర్తిగా నిలుస్తుందని టీడీపీ అధినేత చెప్పారు. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిగా యడ్లపాటి ఎప్పటికీ గుర్తుండిపోతారని తెలిపారు.
More Stories
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై ఈసీ వేటు
సీఎం జగన్ను హత్య చేసేందుకే దాడి
వైఎస్ వివేకా హత్యపై మాట్లాడొద్దన్న కడప కోర్టు