కరోనా సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా విద్యారంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని, దాదాపు 1.1 కోట్ల మంది బాలికలు పాఠశాల విద్యకు దూరమయ్యారని యునెస్కో ఆందోళన వ్యక్తం చేసింది. లింగ అసమానతలు, బాల్య వివాహాల పెరిగాయని, ఈ విషయంలో గత కొన్నేండ్లుగా సాధించినదంతా దెబ్బతిన్నదని తెలిపింది.
భారత్లో పేదలు, అణగారిన వర్గాల పిల్లలపై తీవ్ర ప్రభావం పడిందని, ఒకటి, రెండు తరగతులకు చెందిన ప్రతి ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు తిరిగి పాఠశాలకు రావడం లేదని తెలిపింది. విద్యారంగం నేడు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించకపోతే ముందు ముందు అనేక సమస్యలు వస్తాయని, విద్యారంగంలో సమూలు మార్పులు చేపట్టాలని భారత్ సహా పలు దేశాల్ని యునెస్కో హెచ్చరించింది.
విద్యా హక్కును పరిరక్షించటం కోసం ‘గ్లోబల్ ఎడ్యుకేషన్ కూటమి’ పేరుతో ఒక వేదికను యునెస్కో ఏర్పాటు చేసింది. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల్లోని పౌర హక్కుల కార్యకర్తలిు, విద్యావేత్తల్ని, మేధావుల్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.కరోనా సంక్షోభం విసురుతును సవాళ్లను ఎలా పరిష్కరించాలన్న దానిపై వీరు చర్చించాలని పిలుపునిచ్చింది.
కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచంలో 3.8కోట్లమంది చిన్నారులు స్కూల్స్కు రావటం లేదు. స్కూల్స్కు రాలేకపోతున్న పిల్లల్లో ఎక్కువగా పేదలు, అణగారిన వర్గాలకు చెందినవారే ఉనాురు. ఈ ప్రతికూల ప్రభావం వారి జీవితమంతా ఉంటుంది. కరోనా కారణంగా ఏర్పడ్డ అడ్డంకులిు తొలగించకపోతే సమాజం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 180 లక్ష కోట్ల గంటల బోధనను విద్యార్థులు కోల్పోయారని అంచనా వేస్తున్నాం. కుటుంబ సమస్యలు, పాఠశాలల మూసివేత కారణంగా అదనంగా 10కోట్లమంది బాలల చదువు దెబ్బతిన్నది. వారి కనీస విద్యా నైపుణ్యాలు తగ్గాయి.
కరోనా సంక్షోభ ప్రభావం భారత్ లో గ్రామీణ బాలలు, యువతపై ఎక్కువగా పడింది. స్మార్ట్ఫోన్లు లేకపోవటం, ఇంటరొట్ సౌకర్యం అందుబాటులో లేకపోవటం వల్ల అనేక మంది బాలలు పాఠశాల విద్యకు దూరమయ్యారు. ఆగస్టు 2021నాటి సర్వే ప్రకారం, గ్రామాల్లో ఆన్లైన్ పాఠాలిు కేవలం 8శాతం బాలలే విన్నారు.
ఆన్లైన్ క్లాసుల్ని పూర్తిగా విననివారు 37శాతం మంది ఉనాురు. శాంపిల్ సర్వేలో సగం మంది బాలలు నిరక్షరాస్యులేనని తేలింది. తమ పిల్లలు ఆన్లైన్ తరగుతులు పొందలేకపోతున్నారని 75శాతం తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. చదవటం, రాయటం తగ్గిపోయిందని తెలిపారు.
కరోనా సంక్షోభం చేసిన గాయాల నుంచి విద్యారంగాన్ని కోలుకునేలా చేయాలి. ప్రభుత్వాలు సమూల మార్పులు చేపట్టాలి. పేదలు, అణగారిన వర్గాల పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలి. గ్రామాల్లో, మారు మూల ప్రాంతాల్లో విద్యకు దూరమైన బాలబాలికల్ని తిరిగి పాఠశాలకు వచ్చేట్టు చేయాలి. కరోనా తర్వాత స్కూల్స్కురానటువంటి వారిని గుర్తించాలి. వారి విద్యా హక్కుల్ని పరిరక్షించాలి.
More Stories
మణిపూర్లో మిలిటెంట్ల దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి
ఇక ఏడాదిలో రెండుసార్లు సీబీఎస్ఈ పరీక్షలు
టిఎంసి నాయకుడి ఇంట్లో ఆయుధాలు, బాంబులు