విద్యార్థుల బలిదానాలకు కాంగ్రెస్, టీఆర్ఎస్ దే బాధ్యత

టీఆర్ఎస్, కాంగ్రెస్ డ్రామాలాడుతున్నాయని న్నారు ఎంపీ అర్వింద్ ధ్వజమెత్తారు.  టీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయాలకు వందల మంది బలయ్యారని పేర్కొంటూ తెలంగాణ ప్రకటించాక వాపస్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు.   శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ తర్వాత రెండేళ్లు కాలయాపన చేశారని గుర్తు చేశారు.
ఎన్డీయే హయాంలో  ఎలాంటి గొడవలు లేకుండా మూడు రాష్ట్రాలు ఇచ్చామని పేర్కొన్నారు  తెలంగాణ వచ్చాక కేసీఆర్ టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో ఎందుకు విలీనం చేయలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకాలు పెట్టలేకపోవడం వల్ల చాలా ప్రాజెక్టులు ఆగిపోయాయని విమర్శించారు. 

ట్రైబల్ యూనివర్సిటీ కోసం 2020 వరకు స్థలాన్ని కేటాయించలేదని చెప్పారు. దళిత బంధు, నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. కాళేశ్వరంపై ఇంతవరకు డిపిఆర్ఓ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పెట్టినప్పటి నుంచి కెసిఆర్ ఆయన కుటుంబానికి పూనకాలు వస్తున్నాయని దుయ్యబట్టారు. 

తెలంగాణలో బీజేపీ చేస్తున్న కార్యక్రమాలకు నిన్న ప్రధాని మాటల్లో ఎలాంటి తప్పులేదని అరవింద్ స్పష్టం చేశారు.   రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు  అవుతుంది ఇంకా ఏం సెంటిమెంట్ అని ప్రశ్నించారు. సెంటిమెంట్ పేరుతో ఎన్ని లక్షల కోట్లు దోచుకోవాలని చూస్తున్నావని అర్వింద్ మండిపడ్డారు.

రాష్ట్రంలో విద్యార్థుల బలిదానాలకు కాంగ్రెస్, టీఆర్ఎస్ దే బాధ్యత అని స్పష్టం చేశారు.   కేంద్రం ఇచ్చే నిధులను మిషన్ భగీరథకు మళ్లించారన్నారని ధ్వజమెత్తారు. రోడ్ల నిధులను మళ్లించి  అప్పులు చేసి రోడ్లు వేశారన్నారని చెప్పారు.  ఏడేళ్లలో రాష్ట్రానికి రైల్వే బడ్జెట్ 9 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు.  

రూ 700 కోట్లతో  ఎంఎంటీఎస్ ఫేజ్ 2 పనులను కేంద్రమే పూర్తి చేసిందని తెలిపారు. ఎంఎంటీఎస్ యాదాద్రి ఎక్స్ టెన్షన్ కు రాష్ట్రం నిధులు ఇవ్వడం లేదని గుర్తు చేశారు. ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఇచ్చిన భూములన్నీ లిటిగేషన్ భూములేనని చెప్పారు.