రూ 26,264 కోట్ల పెట్టుబడితో తో విశాఖలోని రిఫైనరీ ని హెచ్ పి సి ఎల్ ఆధ్వర్యంలో ఆధునీకరించే ప్రక్రియను కేంద్రం చేపట్టింది. ప్రస్తుతం సంవత్సరానికి 8.3 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన ఈ రిఫైనరీ సామర్ధ్యాన్ని 15 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహరావు తెలిపారు. .
ఇంతవరకు హెచ్ పి సి ఎల్ చరిత్రలోనే ఇంతటి స్థాయిలో భారీ ప్రొజెక్ట్ చేపట్టడం ఇదే మొదటిసారి కాగలదని ఆయన చెప్పారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్రక్రియ మొత్తం ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర వేగవంతంగా పారిశ్రామికంగా అభివృద్ధి కావడానికి ఈ ప్రాజెక్ట్ దోహదపడగలదని ఆయన అభిలాష వ్యక్తం చేశారు.
ఈ రిఫైనరీ సామర్థ్యం పెంపుదల వలన భారత్ ఆరో దశ మోటార్ ఇంధనాలు,ఇంధన రక్షణ, ఇంధన సంక్లిష్టత మెరుగుదల వంటి బహుళ ప్రయోజనాలు చేకూరడం మాత్రమే కాక దీని ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లక్షల మందికి జీవనోపాధి కలుగుతుందనిభావిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి, పన్నుల రూపంలో ఆదాయానికి ఈ ప్రాజెక్ట్ తోడ్పడగలదు.
.

More Stories
వందల మొబైల్ ఫోన్లు పేలడంతో బస్సు ప్రమాదం?
పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలి
విశాఖలో కంటైనర్ మెగా పోర్టు..నీతి ఆయోగ్