కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశాలకు ”రహస్య పర్యటనల” సమయంలోనే దేశంలో కీలక ఘటనలు చోటుచేసుకున్నాయని అంటూ బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర విస్మయం వ్యక్తం చేశారు. దీనిని ”గుప్త ప్రయోగం”గా ఆయన అభివర్ణించారు.
గత మూడేళ్లుగా వివిధ ఘటనలు రాహుల్ విదేశీ పర్యటనల సమయంలోనే చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇది ”గుప్త్ ప్రయోగ్” (రహస్య ప్రయోగం) అని ఓ ట్వీట్లో సంబిత్ పాత్ర ఆరోపించారు. ఇందుకు సంబంధించిన గ్రాఫిక్స్ను ఆయన షేర్ చేశారు.
ఢిల్లీ అల్లర్లు, రెడ్ ఫోర్ట్ హింసాకాండ, ప్రధాని భద్రతా లోపం…వంటి సంఘటనలను ఈ గ్రాఫ్లో ఆయన సూచించారు. రాహుల్ గాంధీ దేశంలో లేనప్పుడే ఈ ఘటనలు జరిగాయని, ఇది గుప్త ప్రయోగమని తెలిపారు.
రాహుల్ గాంధీ 2020లో రహస్య పర్యటన జరిపినట్టు ఢిల్లీ అల్లర్లు చూశామని, 2021లో రాహుల్ అజ్ఞాత పర్యటనకు వెళ్లినప్పుడు ఎర్రకోట అల్లర్లు జరిగాయని, 2022లో రాహుల్ అలా వెళ్లినప్పుడే ప్రధాని పర్యటనలో భారీ భద్రతా లోపం చోటుచేసుకుందని ఆ ట్వీట్లో సంబిత్ పాత్ర ఆరోపించారు.
More Stories
కుమారస్వామి పేరు చెప్తే రూ 100 కోట్లు ఇస్తానన్న శివకుమార్
స్వాతి మలివాల్పై దాడి కేసులో బిభవ్ కుమార్ అరెస్ట్
కాంగ్రెస్కు అధికారమిస్తే రామాలయాన్ని కూల్చేస్తారు