హైదరాబాద్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ (నైపర్)కు జాతీయ హోదా లభించింది. హైదరాబాద్ నైపర్తో పాటు దేశంలోని మరో ఐదు ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ సంస్థలకు జాతీయ ప్రాధాన్యతను కల్పించే బిల్లును గురువారం రాజ్యసభ ఆమోదించింది.
ఈ బిల్లుకు డిసెంబర్ 6 లోక్సభ ఆమోదముద్ర వేసింది. బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చకు ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా బదులిస్తూ నైపర్లకు జాతీయ ప్రాధాన్యతనివ్వడంతో సహా నాలుగు సవరణలతో బిల్లు రూపొందించామని తెలిపారు.
ఇప్పటివరకూ మొహలీ నైపర్కే జాతీయ హోదా ఉందని, ఆ తర్వాత ఏర్పాటైన మిగతా ఆరు నైపర్లకు జాతీయ ప్రాధాన్యత ఉన్నదో లేదోనన్న సందిగ్దతను తొలగించేక్రమంలో వీటికి హోదా కల్పిస్తూ ఒక సవరణ చేసామని వివరించారు. తాజాగా జాతీయ ప్రాధాన్యతా గుర్తింపు లభించిన నైపర్లు హైదరాబాద్, అహ్మదాబాద్, గువహటి, హాజీపూర్, కొల్కతా, రాయబరెలీల్లో ఉన్నాయి.
ఇవి అండర్గ్రాడ్యుయేట్, డిప్లొమో కోర్సుల్ని ప్రారంభిస్తాయి. వీటికి అడ్వయిజరీ కౌన్సిల్ను నియమిస్తారు. అలాగే ఈ సంస్ధల నిర్వహణను చూసే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుల సంఖ్యను 23 నుంచి 12కు తగ్గిస్తారు.
More Stories
పదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ 10 లక్షల కోట్లు
మేడిగడ్డ పునరుద్ధరణకు ముందుకొచ్చిన ఎల్అండ్టీ
ఆకట్టుకుంటున్న జై హనుమాన్ పోస్టర్