డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి రియల్ ట్రాన్సాక్షన్స్లో అమెరికా, చైనాలను భారత్ వెనక్కి నెట్టిన్నట్లు తెలుపుతూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఫైనాన్షియల్ ఒలంపిక్స్లో ప్రపంచంలో మరే దేశానికి అందనంత ఎత్తులో భారత్ ఉందంటూ ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఇటీవల ఎకానమిక్ ఇంటిలిజెన్స్ యూనిట్ అనే (ఈఐయూ) సంస్థ ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్, రియల్ టైం ట్రాన్సాక్షన్లకు సంబంధించి సర్వే చేపట్టింది. అందులో ఇండియా 25.5 బిలియన్ల ట్రాన్సాక్షన్లతో ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలిచింది.
భారత్ తర్వాత చైనా 15.7 దక్షిణ కొరియా 6, థాయ్లాండ్ 5.2, జిబ్రాల్టర్ 2.8, జపాన్ 1.7, బ్రెజిల్ 1.3, అమెరికా 1.2 బిలియన్ల రియల్టైం ట్రాన్సాక్షన్లు ఉన్నట్టు ఈఐయూ ప్రకటించింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఊ) సిస్టమ్ వచ్చిన తర్వాత భారత్ లో డిజిటల్ పేమెంట్లు ఊపందుకున్నట్టు పేర్కొంది.
More Stories
త్వరలో సాటిలైట్ ఆధారిత టోల్ వసూలు
బుల్లెట్ రైలు కోసం ప్రత్యేక రకం ట్రాక్
ఏప్రిల్ 1 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీ పొడిగింపు