కొన్ని ప్రత్యేక కేటగిరీలకు చెందిన మహిళలు అబార్షన్ చేయించుకోవడానికి గరిష్ఠ కాల పరిమితిని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం 20 వారాల్లోగా అబార్షన్ చేయించుకోవచ్చు. ప్రత్యేక కేటగిరీల మహిళలకు దీన్ని 24 వారాలకు పెంచారు.
లైంగిక దాడులు, అత్యాచారాలకు గురై గర్భం దాల్చినవారు, పెగ్నెన్సీలో ఉన్నప్పుడు విడాకులు తీసుకున్నవారు లేదా విధవలుగా మారినవారు, మైనర్ బాలికలు, దివ్యాంగులు, మానసిక వికలాంగులు ఈ ప్రత్యేక కేటగిరీల కిందకు వస్తారు.
అత్యవసర పరిస్థితులు, విపత్తుల సందర్భాల్లో గర్భం దాల్చినవారిని కూడా ప్రత్యేక కేటగిరీగా పరిగణిస్తారు. తీవ్రమైన శారీరక, మానసిక వైకల్యాలతో శిశువు జన్మించే అవకాశం ఉన్న సందర్భాల్లో కూడా 24 వారాల్లోగా అబార్షన్కు అనుమతిస్తారు. కాగా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక మెడికల్ బోర్డును ఏర్పాటుచేస్తారు. 24 వారాల తర్వాత అబార్షన్ చేయించుకోవాలంటే ఈ బోర్డు అనుమతి తప్పనిసరి.
మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (అమెండ్మెంట్) రూల్స్, 2021 చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆమేరకు కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. అయితే, గర్భస్రావం అభ్యర్థన చేసుకున్న మహిళ.. తన ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవడానికి మూడ్రోజుల సమయం ఇస్తున్నట్టు తెలిపింది.

More Stories
ఢిల్లీలో కురవనున్న తొలి కృత్రిమ వర్షం
ఢిల్లీలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్ .. భారీ ఉగ్రకుట్ర భగ్నం
పంజాబ్ ప్రభుత్వ పాఠశాల గోడపై ఖలిస్థాన్ నినాదాలు