మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఒయు పిహెచ్డి విద్యార్థిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ (ఒయు) లో పిహెచ్డి చదువుతున్న విద్యార్థి కోటా శ్రీనివాస్గౌడ్ (38) ను హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట్కు చెందిన శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్లోని బౌద్ధనగర్లో ఉంటూ ఒయులో పిహెచ్డి చేస్తున్నారు. ప్రస్తుతం టివిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. హైదరాబాద్లో విద్యార్థి ఉంటున్న ఇంట్లో, ఒయు వసతి గఅహంలో అధికారులు సోదాలు నిర్వహించారు.
ఆ సోదాల్లో పలు పత్రాలు, నిషేధిత సాహిత్యం, అనుమానిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు కీలక నేతలతో శ్రీనివాస్గౌడ్ కు నేరుగా సంబంధాలు ఉన్నాయని, వారి సమావేశాలకు చాలాసార్లు హాజరైనట్లు పోలీస్అ ధికారులు చెబుతున్నారు.
ఉస్మానియాతో సహా వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుకునే పలువురు విద్యార్థులను తాను మావోయిస్టు పార్టీలోకి పంపినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో శ్రీనివాస్గౌడ్ పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
More Stories
తెలంగాణలో 12 స్థానాల్లో బీజేపీని గెలిపించాలి
కాళేశ్వరంపై కేసీఆర్ ను కూడా విచారిస్తాం
దేశం సుభిక్షంగా ఉండాలంటే మోదీ రావాలి