మహిళల శానిటరీ ప్యాడ్లు, మెడిసిన్ బాక్సుల్లో డ్రగ్స్

ముంబై సముద్ర తీరంలోని క్రూయిజ్ షిప్ లో జరిగిన రేవ్ పార్టీలో జరిగిన దాడిలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. క్రూయిజ్‌ పార్టీలో డ్రగ్స్ మహిళల శానిటరీ ప్యాడ్లలో లభించాయి.మాదకద్రవ్యాల నిరోధక బృందం (ఎన్సీబీ) దాడి చేసినపుడు క్రూయిజ్ లో డ్రగ్స్ ను మహిళల శానిటరీ ప్యాడ్లు, మెడిసిన్ బాక్సుల్లో కనుగొన్నారు.

 బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తన లెన్స్ బాక్స్‌లో డ్రగ్స్ తీసుకెళుతున్నాడని ఎన్సీబీ అధికారులు చెప్పారు. ఆర్యన్ ఖాన్ పై ఎన్సీబీ అధికారులు  డ్రగ్స్‌ తీసుకోవడం, డ్రగ్స్‌ కలిగి ఉండటం వంటి నార్కోటిక్  డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్ లోని నాలుగు సెక్షన్ల కింద కేసు పెట్టారు.

ముంబై కోర్టు ఆర్యన్ ఖాన్ తోపాటు మరో ఇద్దరిని అక్టోబర్ 4 వరకు పోలీసు కస్టడీకి పంపింది. ఆర్యన్ ఖాన్ వాట్సాప్ ఛాటింగుల్లో అతని స్నేహితులతో డ్రగ్స్ గురించి చర్చించారని ఎన్సీబీ అధికారులు స్పష్టం చేశారు. ఎండీఎంఏ, ఎక్టసీ, కొకైన్‌, ఎండీ, చరాస్‌ లాంటి భిన్న రకాల మాదకద్రవ్యాలు క్రూయిజ్ లో లభించాయి.

అయితే, తన క్లయింట్‌ ఆర్యన్‌ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని అతని తరపు న్యాయవాది సతీష్ మనేషిండే కోర్టుకు తెలిపారు.  ఆర్యన్‌ఖాన్ క్రూయిజ్ పార్టీకి కేవలం అతిథిగా ఆహ్వానంపై వెళ్లాడని, అతని వద్ద ఎలాంటి మాదక ద్రవ్యాలు కనుగొనలేదని వాదించారు.  క్రూయిజ్ పార్టీ నిర్వాహకులతో తన క్లయింట్ ఆర్యన్ ఖాన్ కు ఎలాంటి సంబంధాలు లేవని న్యాయవాది సతీష్ కోర్టుకు వివరించారు.

నాలుగేళ్లుగా డ్ర‌గ్స్ తీసుకుంటున్న‌ ఆర్యన్ 
 
ఆర్య‌న్ ఖాన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచార‌ణ‌లో ఏడుస్తూనే ఉన్నాడ‌ని అధికారులు తెలిపారు. ఈ విచార‌ణ‌లో ఆర్య‌న్ గ‌త నాలుగేళ్ల నుంచి డ్ర‌గ్స్ తీసుకుంటున్న‌ట్లు తేలింద‌ని ఎన్సీబీ అధికారులు వెల్ల‌డించారు. అత‌డు యూకే, దుబాయ్‌, ఇత‌ర దేశాల‌లో ఉన్న‌ప్పుడు కూడా డ్ర‌గ్స్ తీసుకుంటూనే ఉండేవాడ‌ని చెప్పారు.
 
ఆదివారం మొత్తం 8 మందిని ఎన్సీబీ అదుపులోకి తీసుకుంది. ఆర్య‌న్‌తోపాటు అత‌ని స్నేహితుడు అర్బాజ్‌, మ‌రో ఆరుగురిని ఎన్సీబీ సాయంత్రం అరెస్ట్ చేసి వైద్య ప‌రీక్ష‌ల‌కు త‌ర‌లించింది.

సముద్రం మధ్యలో మూడు రోజుల మ్యూజికల్‌ నైట్‌లో భాగంగా నౌకలో ఎఫ్‌టీవీ ఇండియా ఈ రేవ్‌ పార్టీని ఏర్పాటు చేసినట్టు సమాచారం. నౌక ముంబై నుంచి గోవా వెళ్తున్నది. ఎఫ్‌టీవీ ఇండియా ఎండీ కషీఫ్‌ ఖాన్‌తో పాటు పార్టీ ప్లాన్‌ చేసిన కొంత మందికి ఎన్సీబీ సమన్లు పంపింది. పార్టీ శనివారం-ఆదివారం వరకు జరగాల్సి ఉంది. కానీ, పార్టీపై సమాచారం ఉండటంతో ఎన్సీబీ రైడ్‌ చేసింది.

ఎవరీ సమీర్‌ వాంఖెడే..?

పర్యాటక నౌకలో డ్రగ్స్‌ పార్టీని భగ్నం చేసి, బడా బాబుల బరితెగించిన పిల్లలను అదుపులోకి తీసుకున్న ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖెడే పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. అతడి గురించి ఇంటర్నెట్‌లో జనం ఆరా తీస్తున్నారు. 40 ఏళ్ల సమీర్‌ వాంఖెడే ముంబైలో జన్మించారు.  ఆయన తండ్రి పోలీసు ఆఫీసర్‌. సమీర్‌ 2017లో మరాఠి నటి క్రాంతీ రెద్‌కర్‌ను పెళ్లి చేసుకున్నారు.
2004లో ఇండియన్‌ రెవెన్యూ సర్వీసు(ఐఆర్‌ఎస్‌)కు ఎంపికయ్యారు. మొదట ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌(ఏఐయూ) డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అదనపు ఎస్పీగా, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ)లో జాయింట్‌ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. పన్నులు ఎగవేస్తున్న ధనవంతుల బండారాన్ని బయటపెట్టారు. పన్నుల ఎగవేతపై ఉక్కుపాదం మోపారు. ఎగవేతదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారు.
సమీర్‌కు భయం అంటే ఏమిటో తెలియదని, క్రమశిక్షణ కలిగిన నిజాయతీపరుడైన అధికారి అని ఆయనతో కలిసి పనిచేసినవారు చెబుతుంటారు. బాలీవుడ్‌ సినిమాలంటే సమీర్‌కు చాలా ఇష్టం. అయినప్పటికీ విధి నిర్వహణలో తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలను చోటివ్వరు. 2020 నవంబర్‌ 22న డ్రగ్స్‌ ముఠా సమీర్‌తోపాటు మరో ఐదుగురు ఎన్‌సీబీ అధికారులపై దాడి చేసింది. ఈ ఘటనలో ఆయన గాయపడ్డారు