సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఐదు పేజీల బహిరంగ లేఖను వ్రాసారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం నాడు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి,ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు.
తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రం నిర్మాణానికి స్థలం కేటాయించి, కేంద్ర ప్రభుత్వం అందించనున్నఆర్థిక సహాయంతో వాటి నిర్మాణం చేపట్టాలని సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రాన్ని యుద్ధ ప్రాతిపదికన, 2022 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ విమోచన ఉద్యమం సందర్భంగా రజాకార్ల చేతిలో బలైన వారి కుటుంబాలను అధికారికంగా ప్రభుత్వం సన్మానం చేయాలని, వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విమోచన పోరాట చరిత్రను, ఆ ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని పేర్కొన్నారు.
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆ ఉద్యమంలో పాల్గొన్న వారిని సత్కరించాలని డిమాండ్ చేశారు. రజాకార్లను తరిమి కొట్టిన బైరాన్ పల్లి, వరంగల్ కోట, రేణికుంట, కడవెండి, కామారెడ్డిగూడెం, పరకాల, సూర్యాపేట, బీబీనగర్, బాలెంల – పెరుమాండ్ల తదితర ప్రాంతాలతో పాటు, తెలంగాణ విమోచనోద్యమ ఘట్టాలను పరిరక్షించాలని ఆ లేఖలో సంజయ్ కోరారు సంజయ్.
More Stories
హైదరాబాద్ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్ వే
ఖమ్మంలో రాజ్ నాథ్ సింగ్ హెలికాప్టర్ తనిఖీ