
ఏపీలో వినాయకచవితి జరుపుకోవాలని భావిస్తున్న భక్తులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు సృష్టిస్తుండడంపై రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విచారం వ్యక్తం చేస్తూ యేసుకు లేని కరోనా గణేశ్కు ఏందుకని ప్రశ్నించారు.
వైఎస్సార్ వర్థంతి, జయంతి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించామని, షాపింగ్ మాల్స్ ఒపెన్ చేశారు.. ఇక మద్యం షాపుల దగ్గర రద్దీని చూస్తూనే ఉన్నామన్నారు. మరి చర్చిల్లో ప్రార్థనలకు అనుమతించారు.. అక్కడ కరోనా రాదా? అని నిలదీశారు. గణేశుడు ఆదిదేవుడని ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులందరూ ఆరాధించే విఘ్నేశ్వరుని పూజలకు అడ్డంకులు ఏందుకని ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
విగ్రహాలు ధ్వంసం చేసిన వాళ్ళను పట్టుకోలేక పోయిన వారు.. విగ్రహాలు అమ్మనియకుండ చేస్తారా? అని హిందువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని రఘురామ పేర్కొన్నారు. మొహర్రం అప్పుడు లేని కరోనా ఇప్పుడు వినాయక చవితికి ఎలా వచ్చిందని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. సీఎం బెట్టు వీడి అన్ని మతాల వారిని ఒకేలా చూడాలని హితవు చెప్పారు.
నిబంధనలు పెట్టి పండుగలు చేసుకునేందుకు అనుమతించాలని స్పష్టం చేశారు. మూడేళ్లలో బ్రహ్మాండమైన రాజధానిని కడుతానని, రైతులు కళ్ళల్లో ఆనందం చూస్తానని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ అమరావతిలో ప్రసంగించిన విషయాన్ని ఈ సందర్భంగా రఘురామ గుర్తు చేశారు.
పెట్రోలు డీజిల్పై పన్నుల బాదుడు, మధ్య నిషేధం, రాజధాని సహ అన్నింటిపైన ప్రతిపక్ష నేతగా జగన్ మాట్లాడిన మాటలు అన్నిటికీ అద్దం పట్టే పరిస్ధితులు ఇప్పుడు ఉన్నాయని తెలిపారు. మధ్య నిషేధం కాస్తా మధ్య నిషాధంగా మారిందని ఎద్దేవా చేశారు. రాష్టంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారయ్యాయని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు