మతబోధకుడి ముసుగులో అమ్మాయిలకు గాలం వేసి లోబర్చుకుంటున్న కీచక పాస్టర్ను హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఉప్పల్లోని గాస్పల్ చర్చికి పాస్టర్గా పనిచేస్తున్న జోసఫ్ అలియాస్ సాధు.. ప్రముఖ టీవీ ఛానల్లో మత ప్రబోధకుడుగా పని చేస్తూ అమాయక ఆడపిల్లలను టార్గెట్ చేశాడు.
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా వారిపై లైంగిక దాడి చేసేవాడని ఆరోపణలు రావడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికి జోసఫ్ ముగ్గురు అమ్మాయిలను మోసం చేసి, పెళ్లి చేసుకున్నాడు.
ఈ విషయం బయటపడటంతో పాస్టర్ ఆగడాల పై మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఎంఆర్పిఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. తమపై లైంగిక దాడి చేసి, బెదిరింపులకు దిగుతున్నాడని ముగ్గురు అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు పాస్టర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

More Stories
లొంగుబాటుకు మావోయిస్టులు రాజిరెడ్డి, ఆజాద్ సిద్ధం
కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి
డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల దోపిడీకి వ్యతిరేకంగా మహా ధర్నా