‘గుడ్మార్నింగ్ ధర్మవరం’ పేరుతో మార్నింగ్ వాకింగ్ చేస్తూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ నేత, మాజీ ఎమ్యెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. మార్నింగ్ వాక్ పేరుతో ఎమ్మెల్యే కేతిరెడ్డి అవినీతి పరాకాష్టకు చేరిందని ఆరోపించారు.
అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో దౌర్జన్యాలు, దందాలు, భూకబ్జాలు భారీగా పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అవినీతిని ప్రతి 10 రోజులకు ఓసారి బయటపెడతానని వెల్లడించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, రౌడీయిజం, వసూళ్లను వచ్చే ఎన్నికల వరకూ బయటపెడుతూనే ఉంటానని ప్రకటించారు. ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలపై ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాస్తానని కూడా ఆయన తెలిపారు.
అనంతపురం జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించారని, కానీ, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ధన దాహంతో వారి పొట్టకొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా కేతిరెడ్డి అంత అవినీతికి పాల్పడలేదని సంచలన ఆరోపణ చేశారు. టీడీపీ హయాంలో ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదని విమర్శించారు.
ధర్మవరం నియోజకవర్గంలో ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పిలిపించుకుని బిల్లుల సొమ్ము డ్రా చేసుకొచ్చి తన టేబుల్పై పెట్టాలని ఆదేశించారని గోనుగుంట్ల ఆరోపించారు. ఎమ్మెల్యే చెప్పినట్లు పాటిస్తే జైలుకెళ్లడం ఖాయమని అధికారులను ఆయన హెచ్చరించారు.
కొందరు అధికారులు ఎఫ్టీఓలు వాళ్లదగ్గరే అంటిపెట్టుకొని ఎమ్మెల్యే ఆదేశాలతో వారి అనుయాయులకు ఇవ్వాలని చూస్తున్నారని విమర్శించారు. మరో 10 రోజుల తర్వాత ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి సంబంధించిన భారీ కుంభకోణాన్ని బయట పెడతానని సంచలనం రేపారు.
More Stories
ఏపీని అన్ని విధాలా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్’
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్గా విశ్వజిత్
వైసీపీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది