రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు గొప్ప కానుకను అందించనున్నది. మహిళలు ఏ బస్సులోనైనా, ఎప్పుడైనా ఉచితంగా ప్రయాణించేలా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు బుధవారం ఉత్తరప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. 21 ఆగస్ట్ అర్ధరాత్రి నుంచి 22 ఆగస్ట్ అర్ధరాత్రి 12 గంటల వరకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని తమ ఉత్తర్వుల్లో తెలిపింది. మహిళలు అన్ని రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని యూపీఎస్ఆర్టీసీ పేర్కొన్నది.
ఆ రోజున రాష్ట్రంలోని మహిళలంతా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని తెలిపింది. గత సంవత్సరం కూడా దాదాపు 3.5 లక్షల మంది మహిళలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు ప్రభుత్వం గుర్తు చేసింది.
మిషన్ శక్తి మూడవ దశ కింద రక్షాబంధన్ పండుగకు ఒక రోజు ముందు సీఎం యోగి ఆదిత్యనాథ్ మహిళా పోలీసులను బీట్ పోలీస్ ఆఫీసర్లుగా పోస్ట్ చేసే బహుమతిని కూడా ఇవ్వనున్నారు. పింక్ టాయిలెట్ల నిర్మాణంతోపాటు రాష్ట్రంలోని దాదాపు 1300 పోలీస్ స్టేషన్లలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో మహిళా పోలీసుల నియామకం కూడా చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది.
More Stories
బిజెపి-ఎన్డిఎ తప్ప మరెవ్వరు ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు
దుమారం రేపుతున్న బెంగాల్ గవర్నర్ పై లైంగిక ఆరోపణలు
అమేథిలో కాంగ్రెస్ ఓటమిని అంగీకరించింది