ఆరుగురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు

ఆరుగురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు

నిషేధిత మావోయిస్టు (సీపీఐ) పార్టీకి చెందిన ఆంధ్రా-ఒడిశా బోర్డరు ఏరియా కమాండర్‌ సహా ఆరుగురు కీలక సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారని ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ వెల్లడించారు. గత నెలలో మావోయిస్ట్ కమిటీ సభ్యుడు లోంగిపోయాడని, ఈ రోజు మరో ఆరుగురు మావోయిస్టులు సరెండర్ అయ్యారని తెలిపారు.

గతంలో సమస్యలపై మావోయిస్టులు వచ్చి స్థానికులతో మాట్లాడేవారు, ఇప్పుడు ప్రభుత్వం నుంచి సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ఆయన చెప్పారు. గిరిజన ప్రాంతంలో 20 వేల కుటుంబాలకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని, ఆదివాసీల సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేస్తోంది డీజీపీ వివరించారు.

మహిళలకు సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ..ఆదివాసిగూడెంలకు సైతం చేరుతున్నాయని గౌతమ్‌సవాంగ్‌ పేర్కొన్నారు. గతంలో 8 మావోయిస్టు కమిటీలు ఉంటే ప్రస్తుతం నాలుగు ఉన్నాయని చెబుతూ మావోయిస్టులు రక్తపాతం ద్వారా సాధించేదేమీ లేదని స్పష్టం చేశారు. అనేక మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారని పేర్కొన్నారు.

వాలంటీర్ల వ్యవస్థ బాగా పని చేస్తోంది.. నేరుగా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. గతంలో బాక్సైట్‌ సమస్య ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వం  బాక్సైట్ జీవోలను రద్దు చేయడంతో అక్కడ గిరిజనులలోకి చొచ్చుకు పోవడానికి మావోయిస్టు లకు అంశమే లేకుండా పోయినదని చెప్పారు.  పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని  డీజీపీ తెలిపారు.