
గుంటూరు జిల్లాలోని వినుకొండ పట్టణ బీజేపీ అధ్యక్షుడు మేడం రమేష్పై హత్యాయత్నం జరిగింది. శుక్రవారం నాడు మార్నింగ్ వాకింగ్కు వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను అడ్డుకుని దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఆయనకు చేయి విరిగింది. తలకు కూడా తీవ్ర గాయలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రమేష్ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. ఈ దాడి చేయించింది మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అని రమేష్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సురేష్ మహాల్ రోడ్డులో ఆక్రమణ తొలగింపులో శివాలయం కూల్చివేయడం జరిగింది. ఈ శివాలయం కూల్చివేతపై రమేష్ న్యాయపోరాటం చేశారు. ఈ క్రమంలో మున్సిపల్ కమిషనర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో పగ పెంచుకున్న కమిషనర్ ఇలా రమేష్పై హత్యయత్నం చేశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కాగా ఇవాళ జరిగిన ఈ ఘటనతో మరోసారి సురేష్ మహల్ రోడ్డు విస్తరణ పనుల వివాదం తెరపైకి వచ్చింది. అయితే విస్తరణలో భాగంగా శివాలయాన్ని తొలగించినట్లు మున్సిపల్ అధికారులు అప్పట్లో చెప్పారు. శివాలయం తొలగింపుపై బీజేపీ, జనసేన కలిసి న్యాయపోరాటం చేశాయి.
ఈ క్రమంలో వినుకొండ కమీషనర్ శ్రీనివాస్పై చర్యలు తీసువాలని ఉన్నతాధికారులకు బీజేపీ నేత రమేష్ ఫిర్యాదు చేశారు. హైకోర్టు జోక్యంతో మధ్యలోనే విస్తరణ పనులు ఆగిపోయాయి. ఈ క్రమంలోనే తనపై దాడి జరిగిందని రమేష్ చెబుతున్నారు. మొత్తానికి చూస్తే.. ఈ రోడ్డు విస్తరణ పనుల వివాదం చినికి చినికి గాలి వానలా మారింది.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు