నగదు రహిత చెల్లింపులకు మరింత ఊతం ఇచ్చేందుకు.. ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఈ-రూపీ అనే డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ను ప్రారంభించారు. ఇది ఒక ఎలక్ట్రానిక్ ఓచర్ లా పనిచేస్తుంది. దీన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫైనాన్సియల్ సర్వీసెస్ డిపార్ట్ మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, నేషనల్ హెల్త్ అథారిటీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
ఇది ఒక ఎలక్ట్రానిక్ ఓచర్ రూపంలో ఉంటుంది. దీన్ని సంబంధిత లబ్ధిదారులకు ఎస్ఎంఎస్ రూపంలో కానీ.. క్యూఆర్ కోడ్ రూపంలో ప్రీపేడ్ గిఫ్ట్ ఓచర్ గా పంపిస్తారు. దీన్ని ఈ-రూపేను యాక్సెస్ చేసుకునే సెంటర్ల వద్ద పేమెంట్ గా చెల్లించవచ్చు. ఈ- రూపీ కోసం ఎటువంటి క్రెడిట్ కార్డు కానీ.. డెబిట్ కార్డు కానీ అవసరం లేదు.
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి థర్డ్ పార్టీ వాలెట్ యాప్స్ ఏవీ అవసరం లేదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అవసరం లేదు. మొబైల్ బ్యాంకింగ్ అవసరం లేదు. కేవలం మీద దగ్గర ఈ-రూపీకి సంబంధించిన ఎస్ఎంఎస్ కానీ.. క్యూఆర్ కోడ్ కానీ ఉంటే చాలు. ఎక్కడైనా చెల్లింపులు చేసుకోవచ్చు.
ప్రస్తుతం కొన్ని బ్యాంకులు.. ఎన్పీసీఐతో టైఅప్ అయ్యాయి. ఆ బ్యాంకులు కస్టమర్లకు ఈ-రూపీ ఓచర్ ను అందిస్తాయి. పార్టనర్ బ్యాంకులను ముందు సర్వీస్ ప్రొవైడర్లు అప్రోచ్ అవుతారు. ప్రైవేటు, పబ్లిక్ సెక్టార్ కు చెందిన మనీ లెండర్స్ బ్యాంకుల ద్వారా తమ వినియోగదారులకు వోచర్స్ ను అందిస్తారు.
వోచర్స్ ప్రకారం.. అమౌంట్ ఎంత వాడుకుంటే.. అంత అమౌంట్ ను తిరిగి వినియోగదారులు సంబంధిత మనీ లెండర్స్ ను కట్టాల్సి ఉంటుంది. కస్టమర్ ఫోన్ నెంబర్ కు వచ్చే క్యూఆర్ కోడ్ తో ఎక్కడైనా ఈ-రూపీ ద్వారా చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది.
ఈ-రూపీ ఎలా వాడాలి?
- ఈ-రూపీని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీలతో కలిసి దీనిని రూపొందించింది.
- ఈ-రూపీ.. ఇది క్యాష్లెస్, కాంటాక్ట్ లెస్ డిజిటల్ పేమెంట్ విధానం ద్వారా వాడుకోగలిగే ప్రీపెయిడ్ వోచర్. క్యూఆర్ కోడ్ లేదా ఎస్ఎంఎస్ స్ట్రింగ్ బేస్డ్ ఈ-వోచర్ యూజర్ మొబైల్కు వస్తుంది.
- ఎటువంటి కార్డు గానీ, డిజిటల్ పేమెంట్స్ యాప్ గానీ, నెట్ బ్యాంకింగ్ గానీ లేకుండానే పేమెంట్ చేసేయొచ్చు. సర్వీస్ ప్రొవైడర్, యూజర్కు డైరెక్ట్గా ఎటువంటి కాంటాక్ట్ లేకుండానే దీనిని వాడుకోవచ్చు.
- ముందే పేమెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇద్దరి మధ్య లావాదేవీలు పూర్తయిన తర్వాతే కస్టమర్ నుంచి సర్వీస్ ప్రొవైడర్కు మన ఈ-రూపీ చేరి పేమెంట్ కంప్లీట్ అవుతుంది. అప్పటి వరకూ అది హోల్డ్లోనే ఉంటుంది. ఈ-రూపీ తీసుకోవడానికే ముందుగా పేమెంట్ చేసి ఉండడం వల్ల దీనిని సర్వీస్ ప్రొవైడర్కు పంపే విషయంలో ఈ బెనిఫిట్ కలుగుతుంది.
- సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి అందించే బెనిఫిట్స్ విషయంలోనూ అవకతవకలు జరగకుండా చూడొచ్చు.
- మాతృ, శిశు సంక్షేమ పథకాలు, టీబీ నివారణ కార్యక్రమాలు, డయాగ్నొస్టిక్ స్కీమ్స్ లాంటి వాటి కింద అందించే మందులు, పౌష్టికారం వంటి సేవలు అందించడానికి కూడా కేంద్రం ఈ-రూపీని వాడనుంది. ఆయుష్మాన్ భారత్, ఎరువుల సబ్సిడీలు వంటి వాటికి కూడా ఉపయోగించనుంది. ఉద్యోగుల సంక్షేమం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటీ ప్రోగ్రామ్స్ లాంటి వాటికి ప్రైవేటు కంపెనీలూ దీనిని వాడుకోవచ్చు.
- ఈ-రూపీ పేమెంట్స్ చాలా ఈజీగా, సెక్యూర్డ్గా చేయొచ్చు. యూజర్ల ప్రైవసీ కూడా దెబ్బతినకుండా ఉంటుంది.
కార్పొరేట్స్ ఎలా వాడుకోవచ్చు?
- కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన స్కీమ్స్ ఈ-రూపీ ద్వారా అందిచవచ్చు.
- ఈ వోచర్ రిడీమ్ చేసుకున్నారా లేదా అన్నది ఆన్లైన్లో ట్రాక్ చేసుకోవచ్చు.
కస్టమర్కు బెనిఫిట్ ఏంటి?
- కాంటాక్ట్ లెస్ – వోచర్ను ఫిజికల్గా ప్రింట్ రూపంలో తీసుకెళ్లాల్సిన పనిలేదు.
- సెక్యూర్ – 2 స్టెప్ వెరిఫికేషన్తో సేఫ్గా, ఈజీగా రిడీమ్ చేసుకోవచ్చు.
- ప్రైవసీ – యూజర్లు ఎటువంటి వ్యక్తిగత సమాచారాన్ని సర్వీస్ ప్రొవైడర్కు షేర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టీ ప్రైవసీ విషయంలో భయం ఉండదు.
- బ్యాంకుతో పని లేదు – ఈ వోచర్ను రిడీమ్ చేసుకోవడానికి కస్టమర్కు డిజిటల్ పేమెంట్ యాప్ గానీ, బ్యాంక్ అకౌంట్ గానీ అవసరం లేదు.
ఈ-రూపీని ఆఫర్ చేసే బ్యాంకులు
యాక్సిస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఇండసెండ్, కొటాక్, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐల ద్వారా ఈ-రూపీని తీసుకోవచ్చు.
More Stories
అతి త్వరలో మావోయిస్టుల అంతం
102 లోక్ సభ స్థానాలకు మొదటి దశ పోలింగ్ రేపే
నేత్రపర్వంగా భద్రాద్రి సీతారాముల కల్యాణం