ప్రపంచంలోని ముస్లిం శిల్పులంతా విశ్వకర్మ వారసులే అంటూ బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు రాంచందర్ జంగ్రా స్పష్టం చేశారు. చండీఘర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలోని శిల్పుల ప్రస్తావన తీసుకొచ్చారు.
దేశంలోని శిల్పులంతా విశ్వకర్మ వారసులేనని ఆయన పేర్కొన్నారు. మొగల్ చక్రవర్తి బాబర్ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన వెంట శిల్పులను వెంటబెట్టుకునేమీ రాలేదని చెప్పుకొచ్చారు.
ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా లాంటి దేశాల్లో ఎటుచూసినా ఇసుక దిబ్బలే కనిపిస్తాయని, అక్కడ శిల్పకళ అనేదే లేదని రాంచందర్ జంగ్రా చెప్పారు. కాబట్టి ప్రపంచంలోని ముస్లిం శిల్పులంతా విశ్వకర్మ వారసులే అని ఆయన తేల్చి చెప్పారు.

More Stories
కొత్త చరిత్ర సృష్టించేందుకు వేదిక కానున్న పార్లమెంట్
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాపై సుప్రీంకు అస్సాం ప్రభుత్వం
మోస్ట్వాంటెడ్ మహిళా మావోయిస్టు రూపీ మృతి