కాంగ్రెస్ తరపున తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా ఆయన ఎన్నికయ్యారు. ఇక హిమాచల్ప్రదేశ్కు ఆయన నాలుగో ముఖ్యమంత్రిగా పని చేశారు. అప్పటి నుంచి ఆరుసార్లు దఫాలుగా సీఎంగా ఆయన సేవలందించారు.
1934 జూన్ 23న జన్మించిన వీర్భద్ర సింగ్.. రాజ కుటుంబంలో పుట్టారు. అందుకే జనమంతా రాజా సాహిబ్ అని ముద్దుగా పిల్చుకుంటారు. 1976 ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఆయన ప్రతినిధిగా వ్యవహరించారు. అంతేకాదు కేంద్ర కేబినెట్లోనూ పలు కీలక పదవులు అధిరోహించారు.
ఆయన సతీమణి ప్రతిభా సింగ్ మండి నియోజకవర్గం నుంచి లోక్ సభకు రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు. కుమారుడు విక్రమాదిత్య సింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు.
జవహర్ లాల్ నెహ్రు నుండి మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ ప్రధాన మంత్రులు అందరి వద్ద వివిధ హోదాలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆధునిక హిమాచల్ ప్రదేశ్ నిర్మాతగా ఆయనను భావిస్తారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులపాటు అధికారికంగా సంతాప దినాలుగా ప్రకటించింది.
More Stories
ఏడాదికో ప్రధాని.. ‘ఇండియా’ కూటమి కొత్త ఫార్ములా
ఎన్నికల ప్రసంగం మధ్యలోనే స్పృహ తప్పిన గడ్కరీ
దేశంలో కాషాయ కెరటం ఉప్పొంగుతోంది