లేళ్ల అప్పిరెడ్డి : గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలేనికి చెందిన లేళ్ల అప్పిరెడ్డి సామాన్య రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. విద్యార్థి, యువజన, కార్మిక నేతగా పనిచేశారు. వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
మోషేన్రాజు : పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషేన్రాజు వైఎస్ జగన్ పార్టీని ప్రకటించిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వైఎస్ జగన్తో కలిసి పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
తోట త్రిమూర్తులు : తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం సమీపంలోని వెంకటాయపాలెంకు చెందిన తోట త్రిమూర్తులు మండపేట అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. కాపులకు తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారు.
రమేష్యాదవ్ : కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రాజగొల్ల రమేష్యాదవ్ ఉన్నత విద్యావంతుడు. విదేశీ విద్యా సంస్థలతో ఆయన మంచి సంబంధాలున్నాయి. ఆయన తండ్రి కూడా రాజకీయాల్లో కొనసాగారు.
More Stories
నకిలీ దర్శనం టికెట్లు అమ్ముతున్న ఐదుగురు అరెస్ట్
కుంభమేళాలో ఆకట్టుకుంటున్న శ్రీవారి నమూనా ఆలయం
తిరుమల శ్రీవారి పరకామణి బంగారం చోరీకి యత్నం