అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఒక రోజు ముందు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ యోగాపై ఓ ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. యోగా ఏ ఒక్క మతానికో చెందినది కాదని, ఇది మొత్తం మానవాళికి చెందినదని అన్నారు. యోగా వల్ల శరీరానికి, మెదడుకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు.
ఆరోగ్యం కోసం యోగా అనే ఓ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగా అనే సందేశాన్ని పంచుతున్న యునైటెడ్ నేషన్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్, ఇతర సంస్థలను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో కోవింద్తోపాటు కేంద్ర ఆయుష్ సహాయ మంత్రి కిరణ్ రిజిజు, ఆధ్యాత్మకవేత్త కమలేష్ పటేల్, బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, సింగర్ శంకర్ మహదేవన్, రోనీ స్క్రూవాలా పాల్గొన్నారు. ప్రతి ఏటా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
కాగా, మెడిటేషన్, యోగా సైన్సెస్ డిప్లొమో కోర్సును ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రారంభించారు. ఏడాది డిప్లొమో కోర్సుకు సుమారు 450 మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు. అక్టోబర్ 1 నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో బోధకులు ఈ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇస్తారని కేజ్రీవాల్ వెల్లడించారు. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో మెడిటేషన్, యోగా సైన్సెస్ డిప్లొమో కోర్సును ఆయన ప్రారంభించారు.
More Stories
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల తర్వాత పెరిగిన బీజేపీ గ్రాఫ్
వీవీప్యాట్లపై పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు
ఇందిరా ఆస్తి పోవద్దనే వారసత్వపు పన్ను రద్దు