కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణ వేళ సేవా భారతి పేద ప్రజలకు వరంలా మారింది. హైదరాబాద్ నగర శివార్లలోని అన్నోజిగూడలో కోవిడ్ ఐసొలేషన్ సెంటర్ ప్రారంభించి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.
200 పడకల ఈ కేంద్రంలో పెద్ద సంఖ్యలో డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, యోగా సిబ్బంది కోవిడ్ పేషంట్లకు సేవలందిస్తున్నారు. ఈ కేంద్రంలో ఇప్పటికే వందలాది మంది చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
అంతేకాదు కోవిడ్కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా తీర్చేందుకు సలహా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సలహా కేంద్రంలో వైద్యులు ఆన్లైన్ ద్వారా సలహాలందిస్తారు. ప్రతిరోజూ వేలాది మంది ఫోన్ చేసి తమ సందేహాలు తీర్చుకుంటున్నారు.
ఉదయం 8 నుంచి రాత్రి పదిలోగా 040-48213100 నెంబర్కు ఫోన్ చేసి కోవిడ్ చికిత్సపై వైద్యుల సలహాలు తీసుకోవచ్చుని సేవా భారతి ప్రతినిధులు తెలిపారు.
కోవిడ్ స్వల్ప లక్షణాలు కలిగి ఉండి అన్నోజిగూడ ఉచిత కోవిడ్ ఐసొలేషన్ సెంటర్లో అడ్మిట్ కావాలనుకునేవారు ముందుగా 040-48212529 నెంబర్ను సంప్రదించాలని సేవాభారతి ప్రతినిధులు సూచిస్తున్నారు. ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ తప్పనిసరి.
More Stories
మాదిగలు, బిసిలు కాంగ్రెస్కు ఓటేయవద్దు
జీఎస్టీ రిఫండ్ పేరుతో రూ.100 కోట్ల కుంభకోణం
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో అర్జున్ రెడ్డి అరెస్ట్