‘తౌక్టే’ తుపానుపై ప్రధాని మోదీ సమీక్షించారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. తుపాన్ ప్రభావిత రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర అధికార యం త్రాంగం సన్నద్ధతపై ప్రధాని మోడీ శనివారం ఉన్నతస్థా యి సమీక్షా సమావేశం నిర్వహించారు. సంబంధితశాఖల అధికారులు, సహాయక చర్యల్లో పాల్గొనే ఏజెన్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తుపాన్ తాకిడి ఉండే ప్రాంతా ల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రధాని ఈ సందర్భంగా ఆదేశించారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. నిత్యావసర సేవలైన విద్యుత్ సరఫరా, టెలీకమ్యూనికేషన్స్, ఆరోగ్య సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు.
ఎక్కడైనా నష్టం వాటిల్లితే వెంటనే పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కంట్రోల్ రూంలు 24 గంటలు పని చేయాలని ప్రధాని ఆదేశించారు. కొవిడ్ ఆస్పత్రులు, వ్యాక్సిన్ల కోల్డ్ స్టోరేజ్ చైన్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. జామ్నగర్ నుంచి ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని ప్రధాని ప్రత్యేకంగా గుర్తుచేశారు.
తుఫాను నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు 100 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్లు, ఈ బృందాలను తీరప్రాంత రాష్ట్రాలైన కేరళ, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, గోవా, మహారాష్ట్రలకు పంపనున్నట్టు ఎన్డిఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు.
More Stories
భారతీయ వాయుసేనలో మరో దేశీయ అస్త్రం
బెంగళూరు కేఫ్ పేలుడు ప్రధాన సూత్రధారి అరెస్టు
అరుణాచల్లో బీజేపీకి 5 అసెంబ్లీ స్థానాలు ఏకగ్రీవం