ఆంధ్ర ప్రదేశ్రా ష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా మరో ఇద్దరిని ఎంపిక చేశారు. సీనియర్ పాత్రికేయుడు ఉల్చాల హరిప్రసాద్ రెడ్డి, న్యాయవాది కాకర్ల చెన్నారెడ్డిలను సమాచార కమిషనర్లుగా నియమించాలని నిర్ణయించారు.
మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో వీరి పేర్లను ఖరారు చేశారు. తుది ఆమోదం కోసం ఫైలును గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు పంపించారు.
కర్నూలు జిల్లాకు చెందిన హరిప్రసాద్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ‘చరిత్ర’లో పీజీ పూర్తి చేశారు. అదే సమయంలో విద్యార్థి నాయకుడిగా కూడా వ్యవహరించారు. గత రెండు దశాబ్దాలుగా పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. ఎడిటోరియల్ బోర్డు సభ్యుడిగా భారత రాజ్యాంగం, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై అనేక విశ్లేషణాత్మక వ్యాసాలు రచించారు.
ఇక… కాకర్ల చెన్నారెడ్డి పలు జిల్లాల కోర్టులతోపాటు ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర సమాచార హక్కు కమిషన్లో ఇప్పటికే ఒక చీఫ్ కమిషనర్తోపాటు ఐదుగురు కమిషనర్లు ఉన్నారు.
More Stories
ఏపీ అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఖరారు
`ఇంటింటి ప్రచారం’కు ముందస్తు అనుమతి నిబంధన నిలిపివేత
ఏపీలో ఇంటింటి ప్రచారానికి అనుమతి తప్పనిసరి!