ముగిసిన 2020-21 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రాలకు కేటాయించే సాధారణ నిధులకు మించి రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అదనంగా రూ 2,810 కోట్లు కేటాయించింది. ఆంధ్ర ప్రదేశ్ కు రూ 1850 కోట్లు అదనంగా కేటాయించగా, తెలంగాణకు అదనంగా రూ 960 కోట్లు కేటాయించింది.
2020-21లో రాష్ట్రాలకు కేటాయించిన అదనపు నిధుల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2020-21 ఏడాదిలో రాష్ట్రాలకు పన్నుల వాటాకింద రూ 45 వేల కోట్లు అదనంగా కేటాయించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.
పన్నులు, సుంకాల కింద రాష్ట్రాలకు ఇచ్చే నిధుల వాటాకి అదనంగా 8.2 శాతం నిధుల కేటాయించింది. 2020-21లో ఏపీకి రూ 22,611 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ 24,461 కోట్లు కేంద్రం చెల్లించింది. అంటే, ఏపీకి అదనంగా రూ 1850 కోట్లు కేంద్రం కేటాయించింది.
దీంతో పాటుగా 2020-21లో తెలంగాణకి రూ 11,732 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ 12,692 కోట్లు కేంద్రం చెల్లించింది. అంటే, తెలంగాణకి అదనంగా రూ 960 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.

More Stories
సింగరేణి టెండర్ల రద్దు కాంగ్రెస్ దోపిడీ పాలనకు నిదర్శనం
పెండింగ్ చలాన్ల కోసం కీస్ తీసుకోవద్దు, బైక్ లాక్కోవద్దు
వీబీ–జీ రామ్ జీ చట్టం–2025 చారిత్రాత్మక సంస్కరణ