ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్పై వీహెచ్పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హిందువుల విశ్వాసాలను గాయపరిచాడని ఆరోపించారు. హిందూ దేవతల పట్ల విషం కక్కుతూ ప్రతిజ్ఞ చేసిన ప్రవీణ్ కుమార్పైన కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని శశిధర్ డిమాండ్ చేశారు.
ప్రవీణ్ కుమార్ను సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ అందించిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ కుమార్ రాజ్యాంగ బాధ్యతలకు విరుద్ధంగా హిందువుల విశ్వాసాలను గాయపరిచాడని ధ్వజమెత్తారు.
స్వైరోస్పై పలు ఆరోపణలు వస్తున్నా గురుకుల విద్యావ్యవస్థలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను సుదీర్ఘ కాలం ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోందో సమాధానం చెప్పాలని శశిధర్ డిమాండ్ చేశారు. గురుకుల విద్యావ్యవస్థకు మరో ఐఏఎస్ అధికారిని నియమించాలని స్పష్టం చేశారు.
More Stories
పత్తాలేని బిఆర్ఎస్…కాంగ్రెస్కు ఓటమి ఖాయం
మేడిగడ్డను పరిశీలించిన జస్టిస్ ఘోష్
మొట్టమొదటిసారి ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు తీసేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే