సెప్టెంబర్ 8, 1952లో బుర్హాన్పూర్లో జన్మించిన నంద్ కుమార్.. మున్సిపల్ కౌన్సిల్కు చైర్మన్ ఎన్నికై తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన ఖాండ్వా నుంచి అయిదుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. 2009-14మధ్య ఐదేళ్ల కాలంలో తప్ప 1996 నుండి చౌహాన్ లోక్సభ ఎంపీగా కొనసాగుతున్నారు.అదేవిధంగా మధ్యప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేశారు.
వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న చౌహన్ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మధ్యే పరామర్శించారు. నంద్ కుమార్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లో బీజేపీని బలోపేతం చేయడానికి నంద్ కుమార్ ఎనలేని కృషి చేశారని మోదీ కొనియాడారు.
‘ఖాండ్వా లోక్సభ ఎంపీ నంద్కుమార్ సింగ్ చౌహాన్ జీ మరణించినందుకు బాధగా ఉంది. పార్లమెంటరీ కార్యకలాపాలు, సంస్థాగత నైపుణ్యాలు మరియు మధ్యప్రదేశ్లో బీజేపీని బలోపేతం చేయడానికి ఆయన చేసిన కృషి.. ఆయన చిరకాలం గుర్తుండేలా చేస్తుంది. ఆయన కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
More Stories
అమేథిలో రాహుల్, రాయ్బరేలీలో ప్రియాంక పోటీ?
మోదీ, రాహుల్ ప్రసంగాలపై ఈసీ నోటీసులు
ఏడాదికో ప్రధాని.. ‘ఇండియా’ కూటమి కొత్త ఫార్ములా