ఆరు గంటలకు పైగా సాగిన ఈ ఆత్మీయ సమాలోచనలో అనేక ధార్మిక విషయాలపై చర్చ జరిగింది. ప్రత్యేకంగా దక్షిణాదిన కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్,కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాలలో సనాతన ధర్మం, హిందూ సంస్కృతి, హిందువుల విశ్వాసాలమీద వివిధ దిశలలో జరుగుతున్న దాడులపై సదస్సు ఆవేదనను వ్యక్తం చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ లో పూర్వపు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణ పుష్కరాల సందర్భంగా దేవాలయాలను తొలగించిన తీరును రాష్ట్ర ప్రజలు మరచి పోక ముందే దారుణాలు జరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.
అయోధ్యలోని రామజన్మభూమిలో ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడికి దివ్యమైన గుడి కట్టేందుకు మొత్తం హిందూ సమాజం దీక్షాబద్ధమైన సమయాన రాముడు నడయాడిన పుణ్యభూమిలో రాములవారి విగ్రహానికి శిరశ్ఛేదం చేసే దారుణానికి తెగబడటం..సహించరాని, క్షమించరాని దురాగతం అని స్పష్టం చేశారు. అటువంటి దుష్కృత్యాలకు పాల్పడిన దుండగులను రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా దండించాలని డిమాండ్ చేశారు.
దేవాలయ ప్రాంగణాలలో అన్య మత ప్రచారాలు
ఆంధ్రప్రదేశ్ లో నిబంధనలకు విరుద్ధంగా హిందూ దేవస్థానాల పరిసరాలలో , దేవాలయ ప్రాంగణాలలో అన్య మత ప్రచారాలు, అన్యమత చిహ్నాల ప్రదర్శనలు నిరాఘాటంగా సాగుతున్నాయి. తిరుమల, శ్రీశైలం , సింహాచలం వంటి పవిత్ర పుణ్య క్షేత్రాలలో అన్య మతస్తుల ఆగడాలకు అంతు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవలి నెలల్లో హైందవ దేవాలయ వ్యవస్థపై, దేవతా మూర్తులపై, హైందవ మత విశ్వాసాలపై , హిందువుల సెంటిమెంట్లపై జరిగిన దుర్మార్గపు దాడులకు, విధ్వంసాలకు, తీరని అపచారాలకు బాధ్యులైన కర్తలను, కారకులను, వారిని ప్రేరేపించిన వారిని వెంటనే గుర్తించి, శిక్షించేందుకు ప్రభుత్వం సత్వరం కదలాలని పిలుపిస్తూ అది పాలకులకే క్షేమం అని ధచార్యులు ప్రభుత్వానికి కర్తవ్య బోధ చేశారు.
దేవాలయాల నిధులను ధార్మిక ఇతర కార్యక్రమాలకు మల్లించరాదని స్పష్టం చేశారు. దేవాలయాల నిథులలో ఒక్క పైసా కూడా హిందూ ధర్మంతో సంబంధం లేని సెక్యులర్, అవసరాలకు, సంక్షేమ పథకాలకు మళ్ళించకూడదని, ఆయా దేవాలయాల అభివృద్ధికీ ధర్మ ప్రచారానికీ మాత్రమే ఆలయ నిధులు వెచ్చించాలని ప్రభుత్వానికి హిత బోధ చేశారు.
దేవాలయవ్యవస్థ పై ప్రభుత్వ నియంత్రణ , దేవదాయ ధర్మదాయ శాఖ పనితీరు. దేవుడి అస్తుల, ఆభరణాల భద్రత, అర్చకుల సంక్షేమం, భక్తుల సౌకర్యాలు వంటి అనేక అంశాలకు సంబంధించి ఉత్పన్నమైన వివాదాలను , అభియోగాలను , విజ్ణుల సూచనలను సాకల్యంగా అధ్యయనం చేసి పరిస్థితిని చక్కదిద్దే మార్గాన్ని సూచించేందుకు రిటైర్డ్ న్యాయముర్తి ఆధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించాలి. పీఠాధిపతులు, విజ్ణుల సలహాలతో వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఆ కమిటీలో సభ్యులుగా నియమించాలని సదస్సు డిమాండ్ చేసింది.
దేవాలయ కేంద్రంగా భక్త సంఘాలు
దేవాలయ ఆస్తుల , సంప్రదాయాల , ఆచారాల పరిరక్షణ నిమిత్తం దేవాలయాలలో భక్త సంఘాలు ఏర్పడాలని, ఆర్కిలాజికల్ పరిధిలోని ప్రాచీన దేవాలయాల్లో పూజలకు అనుమతులని సదస్సు పిలుపిచ్చింది. అలాగే -దేశ వ్యాప్తంగా అనేక ప్రాచీన దేవాలయాల్లో ఆర్క్యలాజికల్ విభాగపు ఏకపక్ష ధోరణి వల్ల ఆ దేవాలయాల్లో దీప, ధూప నైవేద్యాలు లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేసింది.
అధికారులు ధర్మాచార్యుల తో సంప్రదింపులు జరిపి గర్భ గృహంలో పూజలు హరుగునట్లు, ఆయా దేవాలయాల ప్రాచీనతను కాపాడడంలో ఆర్కియలాజికల్ వారి నియమాలను పాటించే విధంగా ఒక సమన్వయ మార్గాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ రూపొందించాలని ధర్మాచార్యులు సూచించారు.
అన్ని వైపులా దాడులతో సంక్షుభితమైన హిందూ సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలి ? ఏ విధమైన దిశా నిర్దేశం చేయాలి ? సనాతన ధర్మరక్షణకు, హైందవ మత పరిరక్షణకు ఎటువంటి కార్యాచరణ నిర్దేశించాలి? అందులో అన్ని మత శాఖలకు, సంప్రదాయాలకు చెందిన ధర్మాచార్యులను , ఆధ్యాత్మిక వేత్తలను, ధార్మిక ప్రముఖులను , ధార్మిక, మత సంస్థలను ఎలా నిమగ్నం చేయాలి? సనాతన ధర్మ సంరక్షణకు , దుష్ట శిక్షణకు ఏ విధంముందుకుసాగించాలి అన్న అంశాలపై ఈ సదస్సులో లోతైన చర్చ జరిగింది.
ఇటువంటి అతిముఖ్య అంశాలపై సమగ్ర సమాలోచన జరిపేందుకు రెండు తెలుగు రాష్ట్రాలలో వీలైనంత త్వరగా విస్తృత సమావేశాలు నిర్వహించాలని సదస్సు నిర్ణయించింది. ఈ క్రమంలో మొదటి అడుగుగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని సంప్రదాయాలకు, వివిధ హైందవ మత శాఖలకు చెందిన సాధు సంతుల, పీఠాధిపతుల మహాసభను త్వరలో తిరుపతి లో జరపాలని ధర్మాచార్యులు నిర్ణయించారు.
ప్రభుత్వాన్ని నడిపేవారు రాజ ధర్మాన్ని విస్మరించినప్పుడు ధర్మ సంరక్షణకు ప్రజలే ఆయత్తం కావాలి. సనాతన ధర్మాన్ని , హిందూ మతాన్ని కాపాడుకోవటానికి నిరంతరం జాగరూకత చూపాలి. హిందువులందరూ దీర్ఘ కాలిక ధర్మ పోరాటానికి సమైక్యంగా కదలాలని సదస్సు పైపులుపిచింది ఈ దిశగా హిందూ సమాజాన్ని జాగృత పరచటానికి ధర్మాచార్యులు సంయుక్త పర్యటనలు జరపదలిచారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో ప్రకటిస్తారు.
More Stories
పోలీసుల అదుపులో తెనాలి, తాడిపత్రి వైసిపి ఎమ్యెల్యేలు
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి మాధవీలతపై కేసు నమోదు
ఆప్ ఎంపీ స్వాతిపై కేజ్రీవాల్ పిఎ దాడి!