సూపర్స్టార్ రజనీకాంత్ గత వారమే చేరిన అన్నాత్తే మూవీ షూటింగ్లో కరోనా కలకలం చెలరేగింది. ఈ సినిమా యూనిట్లో 8 మందికి కరోనా పాజిటివ్గా తేలడంతో ముందస్తు జాగ్రత్తగా రజనీ సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు.
లాక్డౌన్, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఫిల్మ్ షూటింగ్ కొన్ని నెలల పాటు ఆగిపోయింది. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో డిసెంబర్ 14న అన్నాత్తే షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ మూవీకి సిరుత్తై సివ దర్శకత్వం వహిస్తుండగా నయనతార, కీర్తీ సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా అన్నాత్తే మూవీ సిబ్బందికి నిర్వహించిన టెస్టుల్లో 8 మంది కరోనా పాజిటివ్గా తేలారు. దీంతో రజనీతో సహా సినీ యూనిట్ మొత్తం రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉండనున్నారు.
రజనీకాంత్ హోం ఐసోలేషన్ లో ఉండగా, నయనతార, కీర్తిసురేశ్, ఇతర నటీనటులు క్వారంటైన్ లో ఉన్నారు. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, సూరి, నయనతార, కీర్తిసురేశ్, ఖుష్బూ, మీనా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
రజనీకాంత్ రాజకీయ పార్టీ ఆవిర్బావం నేపథ్యంలో తొందరగా పూర్తి చేయాలని భావించి రోజుకు 14 గంటలు షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే హఠాత్తుగా ఇలా కరోనా కేసులు బయటకు రావడంతో షూటింగ్ నిలిచిపోయింది.
More Stories
ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ దేశంలోనే టాప్
ధాన్యం అక్రమాలపై రేవంత్ తేల్చకపోతే సీబీఐ దర్యాప్తు కోరతాం
రేవ్ పార్టీలో నటి హేమతో సహా 8 మందికి నోటీసులు