
కేరళలోని ప్రముఖ శబరిమల ఆలయం ఆదివారం తెరుచుకున్నది. మండలకాల-మకరవిల్లక్కు పండుగ కోసం అయ్యప్ప గుడి తలుపులు తెరిచారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
శబరిమలలో సోమవారం నుంచి డిసెంబర్ 26 వరకు మండల పూజలు జరగనున్నవి. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చేభక్తులు తప్పనిసరిగా పాటించాల్సిన నియమ నిబంధనలను ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు మార్గదర్శకాలను విడుదల చేసింది. అందులోభాగంగా వర్చువల్ క్యూలో రిజిస్టర్ చేసుకోని భక్తులను అనుమతించరు.
వారంలో ఐదు రోజులపాటు ప్రతి రోజూ 1,000 మంది భక్తుల్ని మాత్రమే అనుమతిస్తారు. శనివారం, ఆదివారం మాత్రం 2,000 వేల మందిని చొప్పున భక్తుల్ని అనుమతిస్తున్నారు. అయితే మాండవిలక్కు, మకరవిలక్కు రోజులలో ఆలయాన్ని సందర్శించే అయ్యప్ప భక్తుల సంఖ్యను 5000కు పెంచుతామని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ఇటీవల తెలిపింది.
ఇప్పటికే డిసెంబర్ వరకు క్యూ స్లాట్స్ బుక్ అయ్యాయి. నవంబర్ 16 నుంచి డిసెంబర్ 26 వరకు మండల పూజ, డిసెంబర్ 30 నుంచి 2021 జనవరి 20 వరకు మకరవిలక్కు పూజ, జనవరి 14న మకరవిలక్కు నిర్వహిస్తారు.
మరోవైపు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు తాజాగా కొత్త గైడ్లైన్స్ జారీ చేసింది. భక్తులందరూ తప్పనిసరిగా కోవిడ్-19 నెగిటీవ్ సర్టిఫికెట్ తీసుకొని రావాలి. అది కూడా గత 24 గంటల్లో తీసుకున్న సర్టిఫికెట్ అయి ఉండాలి.
మెడికల్ ఇన్స్యూరెన్స్ కార్డు తప్పనిసరి. భక్తులదంరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. శానిటైజర్లు ఉపయోగించాలి. 10 ఏళ్లలోపు 60 ఏళ్ల పైబడిన వయస్సు ఉన్న వారిని దర్శనానికి అనుమతించరు.
ఈసారి పంబ నదిలో స్నానాలకు అనుమతి లేదు. భక్తులకు స్నానాల కోసం ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు పంబలో ప్రత్యేకంగా షవర్లను ఏర్పాటు చేసింది. పంబలో లేదా సన్నిధానంలో భక్తులు బస చేసేందుకు అనుమతి లేదు. నీలక్కల్ దగ్గర పరిమితంగా బస ఏర్పాట్లు ఉంటాయి.
స్వామి అయ్యప్పన్ రోడ్డు ద్వారానే ట్రెక్కింగ్కు అనుమతి ఉంది. సన్నిధానం దగ్గర నెయ్యాభిషేకం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉంటాయి. భక్తులను పంబకు తీసుకెళ్లి తిరిగి నీలక్కల్కు తీసుకొచ్చేందుకు లైట్ మోటార్ వాహనాలు అందుబాటులో ఉంటాయి.
More Stories
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!
అహ్మదాబాద్లో విమాన ప్రమాదంపై అమెరికాలో దావా