హైకోర్టును ఆశ్రయించిన రఘునందన్ రావు

సిద్దిపేట ఘటనపై ఎమ్మెల్యేగా ఎన్నికైన బిజెపి నేత ఎన్  రఘునందన్ రావు హైకోర్టును ఆశ్రయించారు. సిద్దిపేటలో నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. 
రూ.18 లక్షలు దొరికాయంటూ కట్టు కథ అల్లారని రఘునందన్ రావు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను సీజే ధర్మాసనం విచారిస్తుందని జస్టిస్ లక్ష్మణ్‌ బెంచ్ చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీకి న్యాయమూర్తి ఆదేశించింది.
దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రఘునందన్‌రావు మామ అంజన్‌రావు ఇంట్లో సెర్చ్‌ చేశారు. అంజన్‌రావు ఇంట్లో రూ.18.67 లక్షలు పట్టుబడ్డాయని పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్ తెలిపారు. 
 
రఘునందన్‌ అనుచరులు రూ.12.80 లక్షలు ఎత్తుకెళ్లారని తెలిపారు. 30 మందిని గుర్తించామని, వారిపై కేసులు నమోదు చేస్తామని జోయల్‌ డేవిస్ పేర్కొన్నారు.