కొవిడ్ బారినపడ్డ అమెరిక్లకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తానని, ఎవరూ అందుకోసం ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తూ వైరస్ సోకడం మీ (అమెరిక్ల) తప్పు కాదు.. చైనాదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
ఇదంతా జరిగింది.. మీ తప్పు కాదని, ఈ దేశానికి చేసిన దానికి చైనా భారీ మూల్యం చెల్లించబోతోందని ట్రంప్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో ప్రసంగంలో హెచ్చరించారు.
ట్రంప్ తనకు కరోనా చికిత్స ఉపయోగించిన ఔషధాలపై ప్రశంసించారు. ఈ మందులు వైరస్ నివారణకు టీకాల వలే ముఖ్యమైనవని పేర్కొన్నారు. తాను హాస్పిటల్లో నాలుగు రోజులు గడిపానని, తక్కువ వ్యవధిలో కోలుకున్నానని తెలిపారు. తనకు అందించిన కరోనా వైరస్ చికిత్సపై వైద్య సిబ్బందిని ఆయన అభినందించారు.
హాస్పిటల్లో రెజెనెరాన్ అనే మందును ఇచ్చారని, దీన్ని తీసుకున్న వెంటనే మంచి అనుభూతిని పొందగాలిగానని చెప్పారు. `నేను ప్రస్తుతం ఎలా చేయగలుగుతున్నానో.. మూడు రోజుల క్రితం అలాగే అనిపించింది’ అని తెలిపారు.
ఈ సందర్భంగా వ్యాక్సిన్ల తయారీపై ట్రంప్ మాట్లాడుతూ జాన్సన్.. జాన్సన్, మోడరనా వంటి అనేక కంపెనీలు తయారు చేస్తున్న వ్యాక్సిన్లు చివరి దశలో ఉన్నాయని తెలిపారు. త్వరగానే గొప్ప వ్యాక్సిన్ను చేయబోతున్నామని చెప్పారు.
గతవారంలో ట్రంప్, మెలానియా దంపతులు కరోనా పాజిటివ్గా పరీక్షించారు.దీంటోట్రంప్ వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ హాస్పి టల్లో చేరారు. సోమవారం ట్రంప్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జై వైట్హౌజ్కు చేరుకున్నారు.
More Stories
వంతెన ప్రమాదంలో భారతీయుల చొరవకు బిడెన్ ప్రశంస
అసాంజెను అమెరికాకు తక్షణమే అప్పగించలేం
అమెరికాలో కుప్పకూలి నదిలో పడిపోయిన వంతెన