
ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమ ఆక్రమించడానికి వీల్లేదని తెలంగాణ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దర్శకుడు ఎన్. శంకర్కు భూమి కేటాయింపుపై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. రూ.2.5 కోట్ల విలువ చేసే భూమిని రూ. 25 లక్షలకు ఎలా కేటాయిస్తారని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
హైదరాబాదులో ఇప్పటికే అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీ ఉందని, ఇతర వ్యక్తులకు స్థలాలు ఇవ్వకుండా ప్రభుత్వమే సొంతంగా సినిమా స్టూడియో నిర్మించవచ్చు కదా? అని వ్యాఖ్యానించింది.
ఇక ధర్మాసనం వ్యాఖ్యలపై స్పందించిన అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కేబినెట్ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో శంకర్ కీలక పాత్ర పోషించారని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఏబీ వ్యాఖ్యలతో ఏకీభవించని హైకోర్టు తెలంగాణ కోసం త్యాగం చేసిన వేల మందికి ఇలాగే ఇస్తారా అని ప్రశ్నించించింది.
దీనిపై మరోసారి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి ఏజీ రెండు వారాల గడువు కోరాగా.. అనుమతించిన న్యాయస్థానం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా శంకర్ కు తెలంగాణ ప్రభుత్వం భూమిని కేటాయించడాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
More Stories
కాళేశ్వరంలో అవినీతి అనకొండ హరిరామ్ అరెస్ట్
కేసీఆర్ కు కుటుంబ సభ్యుల నుంచే ముప్పు
లద్దాఖ్, పీఓకె లేని భారత్ మ్యాప్ వివాదంలో రేవంత్ ప్రభుత్వం