
చైనా నుంచి నిష్క్రమిస్తున్న కంపెనీలను భారత్కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతున్నట్టు కనిపిస్తున్నది. తాజాగా చైనాలోని 24 కంపెనీలు భారత్లో మొబైల్ ఫోన్ కర్మాగారాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయి.
ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో దిగ్గజాలుగా పేరుగాంచిన ఆపిల్, శాంసంగ్ లాంటి సంస్థల అసెంబ్లింగ్ భాగస్వాములు చైనా నుంచి భారత్కు తరలివచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. మొబైల్ ఫోన్ కర్మాగారాల ఏర్పాటు నిమిత్తం ఈ సంస్థలు భారత్లో 1.5 బిలియన్ డాలర్ల (రూ.11,217 కోట్ల)మేరకు పెట్టుబడు లు పెట్టేందుకు ముందుకు వచ్చినట్టు ‘బ్లూమ్బర్గ్’ వెల్లడించింది.
కరోనా వైరస్ వ్యాప్తి, అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఈ కంపెనీలు తమ సైప్లె చైన్లను ఇతర దేశాలకు తరలించాలని యోచిస్తున్నాయి. భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించాలని ఆపిల్ భావిస్తున్నట్టు తాజా వార్తలు స్పష్టం చేస్తున్నాయి.
అలాగే ఆపిల్కు వివిధ రకాల విడిభాగాలను సరఫరా చేయడంతోపాటు ఐఫోన్లను అసెంబ్లింగ్ చేస్తున్న ఫాక్స్కాన్ సంస్థ కూడా చెన్నైకి సమీపంలోని తమ ప్లాంట్లో రానున్న మూడేండ్లలో 1 బిలియన్ డాలర్ల (రూ.7,478 కోట్ల) పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నది. ఐఫోన్ల ఉత్పత్తిని చైనా నుంచి ఇతర దేశాలకు తరలించాలని ఆపిల్ ఇప్పటికే తమ భాగస్వాములకు గట్టిగా విజ్ఞప్తి చేసినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత
ఏపీ పట్టణాల్లో స్లీపర్సెల్స్ పై పోలీసుల డేగకన్ను